సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. జెమా సమీపంలో ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురై 16 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు సీజేవోలు,13 మంది జవాన్లు ఉన్నారు. మరో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. సహాయక బృందాలు హెలికాప్టర్లో వారిని ఆసుపత్రికి తరలించారు. మూడు ఆర్కీ వాహనాల కాన్వాయి థాంగు వైపు వెళ్తుండగా …ఒక ట్రక్కు మలుపులో ప్రమాదవశాత్తూ లోయలోకి జారిపడింది.
నార్త్ సిక్కింలో ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరజవాన్లు అందించిన సేవలు, నిబద్ధతను దేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.