ఆర్మీ చేతికి సరికొత్త అస్త్రం
భారతీయ సైనిక బలగాలకు ఇది స్వర్ణయుగం. ఒకప్పుడు చాలీచాలని ఆయుధాలు, సాధన సంపత్తి, కనీసం ప్రాణ రక్షణకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేని దుస్థితి ఉండేది. 2014 నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం సైనికులకు అవసరమైన సాధన సంపత్తి, ఆయుధాలు సమకూరుస్తున్నది. ఇప్పుడు శత్రులు ఎదురుపడితే షూట్ చేయడమే తప్ప, ఎవరి ఆర్డర్ కోసమో ఎదురు చూసే అవసరం లేదు. తాజాగా ఆర్మీ కోసం కేంద్రం ఇజ్రాయిల్ తయారీ అటాక్ మషిన్ గన్స్ ను సమకూర్చడం మొదలుపెట్టింది.
సైనికుల కోసం ఇజ్రాయిల్ తయారు చరేసే నెగెవ్ లైట్ మషిన్ గన్స్ ఎంతో శక్తివంతమైనవి. అందుకే రూ. 880 కోట్లతో 16,000 గన్స్ కోసం మోడీ ప్రభుత్వం గత ఏడాది ఆర్డర్ ఇచ్చింది. అందులో భాగంగా 6000 గన్స్ ఇప్పటికే ఇండియన్ ఆర్మీకి చేరాయి. మిగతా పది వేల గన్స్ మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయి. ఓ వైపు ఉత్తర్ ప్రదేశ్ లో కొత్తగా ప్రారంభించిన ఆయుధ కర్మాగారంలో అత్యాధునిక ఏకే రైఫిల్స్ తయారీ జరుగుతోంది. అయితే భారీ ఎత్తున శత్రువుల నుంచి దాడి జరిగినప్పుడు ప్రతిదాడికి మషిన్ గన్స్ అవసరం అవుతాయి. మన చిరకాల మిత్రదేశం ఇజ్రాయిల్ ఈ గన్స్ ను సరఫరా చేస్తోంది.