జమ్మూ కాశ్మీర్ లో జరిగిన టెర్రర్ ఆపరేషన్లో ఇండియన్ ఆర్మీకి చెందిన ‘ఆక్సెల్’ అనే శునకం మరణించింది. బిల్డింగ్ క్లియరెన్స్ ఆపరేషన్ సందర్భంగా శనివారం కాశ్మీర్ లోయలో జరిపిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో ఆక్సెల్ ప్రాణాలు కోల్పోయింది. పోస్టుమార్టం నివేదికలో తొడ ఎముకలో 10కి పైగా గాయాలు అయినట్లు తేలింది.
బిల్డింగ్ క్లియరెన్స్ ఆపరేషన్ సమయంలో మొదట్లో బిల్డింగ్ లోకి మరో ఆర్మీ శునకం ‘బాలాజీ’ని పంపారు. లోపలి కారిడార్ను క్లియర్ చేసింది. ఆ తర్వాత ఆక్సెల్ ను మోహరించారు. ఆక్సెల్ మొదటి గదిలోకి వెళ్లి అక్కడ క్లియర్ చేసింది. రెండవ గదిలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం అది 15 సెకన్ల పాటు కొట్టుమిట్టాడింది, ఆ తర్వాత పడిపోయింది.
సైనికులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగాయి.. ఆపరేషన్ ముగిసిన తర్వాత, ఆక్సెల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భారత సైన్యం నిన్న ఆక్సెల్ కు నివాళులర్పించింది.