కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు లాస్ట్ చాన్స్ ఇచ్చింది. రెండు వారాల్లోగా తన వాదనలు వినిపించాలని, లేదంటే కోర్టు ధిక్కార నేరం కింద కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 24కు వాయిదా వేసింది.
మాల్యా దాదాపు 9 వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగవేసి, బ్రిటన్ వెళ్ళిపోయాడు. ఆ మధ్యే తన 40 మిలియన్ డాలర్లను తన కుమారుడికి బదిలీ చేశారు. తమ ఆదేశాల్ని ధిక్కరించి లావాదేవీలు జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం… కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని…తమ ఎదుట హాజరుకావాలని పలుమార్లు ఆదేశించింది. బ్రిటన్లోని అత్యున్నత న్యాయస్థానం విజయ్ మాల్యాను భారత దేశానికి అప్పగించాలని తీర్పు ఇచ్చింది. అయినా సరే ఆ దేశం కోర్టు తీర్పును అమలు చేయడం లేదు. బ్రిటీష్ ప్రభుత్వం రహస్యంగా ఏం చేస్తున్నదో తెలియడం లేదని కేంద్రం సుప్రీం కోర్టు దృష్టికీ తీసుకెళ్లింది. విజయ్ మాల్యా పలు కారణాలు చెబుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ అక్కడే తలదాచుకుంటున్నాడు.