ఆఖరికి ఈ దేశం లో ప్రభుత్వం రోడ్లు నిర్మించడానికి కూడా బోలెడు ఆటంకాలు.
ఎవడో ఒకడు ఒక NGO ప్రారంభించి ఏదో ఒక పర్యావరణ కారణం చూపించి కోర్టులో కేసు వేస్తే అది తేలడానికి సం. లు పట్టచ్చు లేదా దశాబ్దాలు పట్టవచ్చు. ఈ లోగా అన్ని అడ్డంకులు దాటి ముందుకు వెళ్లే సరికి ముందు వంద రూపాయలు ఖర్చు అనుకున్నది వెయ్యి రూపాయలకు పెరుగుతుంది.
కాలుష్యం పెరిగిపోతోంది అని సాకుతో తమిళనాడు లో స్టీరిలీట్ రాగి పరిశ్రమ విస్తరణ కార్యక్రమాన్ని కొన్ని క్రిస్టియన్ NGO సంఘాలు, వామపక్షాలు కల్సి కోర్టులో పిల్ వేసి ఆ ఫ్యాక్టరీ మొత్తం మూయించేశారు. దాని వల్ల ఆ కంపెనీ మీద ఆధార పడ్డ 800 చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. డైరెక్ట్ గా 12000 కుటుంబాలు ఉపాధి కోల్పోతే పరోక్షంగా 50 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కేంద్రానికి సం. కి సుమారు 2500 కోట్లుకు పైగా టాక్స్ నష్టం. ఈ పరిశ్రమ మూత వల్ల లాభ పడ్డది ఎవరు,? ఇంకెవరు మన వామపక్షాల మిత్ర దేశం చైనా..ఇప్పుడు భారత్ 15 వేల కోట్ల ఖరీదు చేసే రాగి ప్రతీ సం. దిగుమతి చేసుకుంటోంది. మే 2018లో మోసేయ్యమని ఉత్తర్వులు ఇచ్చిన కోర్టులు మాత్రం ఈ కేసు రివ్యూ పిటీషన్ పై ఇంకా అలా సాగదీస్తూనే ఉన్నాయి. ఏం ఉద్యోగస్తుల హక్కులు అని గొంతుచించుకునే వామపక్ష నాయకులు తీసుకోవలసిన భద్రత చర్యలు తీసుకుని స్టీరిలీట్ పరిశ్రమ పున:ప్రారంభించమని ధర్నాలు చేసి సుప్రీంకోర్టు లో పిల్ వేయచ్చు కదా? వేయరు? కారణం? కేంద్రం చార్ ధామ్ యాత్రకు ఉపయోగపడేటట్లు రెండు వరసల రోడ్లు నిర్మించాలి అని తలచింది. అయితే సిటిజన్స్ ఫర్ గ్రీన్ డూన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం ఆపాలి అని సుప్రీంకోర్టు లో కేసు వేసింది. దానిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు రోడ్డు 5.5 మీటర్లు అంటే సుమారు 16 అడుగులు కంటే వెడల్పు ఉండరాదు అని సెప్టెంబర్ 8, 2020 ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిపై కేంద్రం రివ్యూ పిటీషన్ వేస్తూ, గతంలో రోడ్డు విస్తరణ పూర్తిగా ఆపకుండా కోర్టు ఉత్తర్వులు దేశ రక్షణకు ఊపిరి పోశాయని, అయితే చైనాతో ఉద్రిక్తతల నడుమ భారీ సైనిక సామగ్రిని తరలించడానికి ఈ రోడ్డు వెడల్పు చాలదు అందువల్ల కోర్టు ఉత్తర్వులు సడలించమని కోరింది.
NGO తరఫున సీనియర్ న్యాయవాది, వామపక్ష సానుభూతి పరుడు కోలిన్ గోన్సాల్వేస్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం ‘చార్ ధామ్ పరియోజనా’ను అమలు చేయాలనే ప్రధానంగా ఉద్దేశం అయినా సైన్యం అయిష్టంగానే రోడ్ల విస్తరణకు అంగీకరించిందని వాదించారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ అనే నాలుగు ధామ్లను కలిపే రహదారిని అప్గ్రేడ్ చేసి అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ గురించి ఆయన ప్రస్తావిస్తూ 900 కిలోమీటర్ల రహదారి ద్వారా హిందూ తీర్థయాత్రను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోంది అని కోర్టుకు తెలిపారు. చార్ ధామ్కు దారితీసే రోడ్ల విస్తరణకు సంబంధించి ‘గ్రీన్ డూన్’ దాఖలు చేసిన అసలు పిటిషన్ను న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, సూర్యకాంత్, విక్రమ్ నాథ్లతో కూడిన ధర్మాసనం ముందు ఏజీ వాదించారు. 2018 లో ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్పైనే సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయని, అయితే సైన్యం అవసరాలను ఆ సర్క్యులర్లో పేర్కొనలేదని, కానీ చైనాతో పెరిగిన ఉద్రిక్తత ల వల్ల సైన్యం అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం 2020లో మరో సర్క్యులర్ను ఆమోదించింది అని దానిని అమలు చేయడానికి కేంద్రం కోర్టు అనుమతిని కోరుతున్నారు అని AG కోర్టుకు తెలిపారు.
1962 ఇండో-చైనా యుద్ధంలో, ప్రభుత్వం సైన్యానికి అవసరమైన వస్తువులను సరఫరా చేయలేకపోయిందని మరియు సైనికులు పోరాడటానికి పర్వతాల మీదుగా నడవవలసి వచ్చింది అని AG చెపుతూ “సైన్యానికి ఉపయోగపడే ఈ చర్యలను మేము గొన్ సలావ్స్ కు తెలియజేసాము. అతను సీనియర్ న్యాయవాది కాబట్టి ఆ సమాచారాన్ని పబ్లిక్ లో పెట్టరు అని మాకు తెలుసు. అక్టోబరులో చైనా ప్రభుత్వం తమ సరిహద్దుల రక్షణ కోసం ఒక చట్టాన్ని ఆమోదించింది. అందుకే మనం కూడా ఇటువైపు బోర్డర్ రక్షణ చర్యలు తీసుకోవాలి అని వాదించారు. చార్ ధామ్ పరియోజన ప్రకటించినందు వల్లే రోడ్డు విస్తరణ జరుగుతోంది, ఇది పర్వతాలపై నిర్మించే హైవేలపై ల SUVలను పర్వతం పైకి క్రిందికి పరుగెత్తేలా చేస్తుంది అని గోన్ స్లావ్స్ వాదించారు. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ బదులిస్తూ చైనా బలగాలు బోర్డర్ వద్ద ఏర్పాటు చేసింది అనే వాస్తవ స్థితిని కానీ, ఈ రోడ్లు సరిహద్దులోని సైనికులకు అవసరమైన సామాగ్రిని తరలించే ఫీడర్ రోడ్లు కావు అని కానీ చెప్పగలమా అని అడిగారు.
సైన్యం రాజకీయ ఒత్తిళ్లతో వ్యవహరిస్తోందని గోన్సాల్వ్స్ వాదించారు. హిమాలయాల్లో ప్రభుత్వం నిర్మించిన 17 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు బంపర్ టు బంపర్గా మారాయని, 2013లో వరదలకు ఇవే కారణం అని వాదించారు. పర్యాటకాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం రహదారిని విస్తరించాలనుకుంటే కోర్టు కఠినమైన షరతులు విధించవచ్చు , అయితే రక్షణ సమస్యల గురించి రెండో మాట లేదు అని జస్టిస్ చంద్రచూడ్ బదులిచ్చారు.. అలాగే కొండ ఎత్తుల్లో రవాణా సదుపాయాలు లేని చోట్ల నివసించే ప్రజలకు కష్ట సమయాలలో ఆర్మీయే సాయం చేస్తూ ఉంటుంది. అందువల్ల ఆర్మీని సామాన్య ప్రజలను వేరుగా చూడలేం అని బెంచ్ పేర్కొంది.
దీనిపై కోర్టు ఈ రోజు విచారణ కొనసాగించనుంది.
వామపక్షాల మిత్ర దేశం చైనాకు ఈ NGO ల ‘పిల్లుల’ తలనొప్పి ఉండదు. అందుకే ఆ దేశంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయి. అందుకే చైనా వాడు మనలని ఓడించడానికి మన దేశంతో యుద్ధం చెయ్యక్కరలేదు.. డిఫెన్సె ఎక్విప్మెంట్ కొనకుండా రఫెల్ కేసులాగా లేదా అవినీతి జరిగింది అని, లేదా ఇలా బోర్డర్ లో రోడ్లు వేద్దామన్నా లేక వేరే చోట పెద్ద ఫ్యాక్టరీలు పెడదామన్నా లేక ప్రాజెక్టులు కడదామన్నా పర్యావరణ కాలుష్యం అని చైనా తాను బిస్కెట్లు వేసే NGO ల చేత లేక తమ వామపక్ష భావజాల కార్యకర్తలు లేదా లాయర్ల చేత భారత కోర్టుల్లో కేస్ వేయించవచ్చు. ఆ పిల్స్ కి మన వామపక్షాల మద్దత్తు మరియు ఉదారవాదుల మద్దత్తు పుష్కలంగా ఉంటుంది. ఆ ప్రాజెక్టులు పై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం సం. ల తరబడి ఆ ప్రోజెక్టులు పూర్తి కాకుండా అడుగు అడుక్కి అడ్డుపడుతూ వుంటారు.
మళ్లీ వీళ్ళని మనం దేశద్రోహులు అంటే పిసుక్కుంటూ చస్తారు.
Courtesy :- Chada Sastry