ముందుస్థ యోజన లేకుండా ఎక్కడ దాడులు జరగవు, దాడులు చేసిన వాళ్ళు తమ లక్ష్యం పూర్తయిన తర్వాత తప్పించుకునేందుకు సరైన వ్యవస్థ చేసుకోకుండా ఎవరు దాడులు చేయరు ఇటువంటి దాడులు చేసే వారి వెనుక ఏ శక్తులు పని చేస్తుంటాయి, దానికి కావలసిన డబ్బుల మూటలు ఎవరు అందిస్తున్నారు, వాళ్ల లక్ష్యం ఏమిటి? ఈ దాడుల వెనుక వివిధ రాజకీయ పార్టీల ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? దేశంలో అంతర్గత సంఘర్షణలను నిర్మాణం చేయాలని శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ఎవరైనా కుట్రలు పన్నుతున్న రా? ఆ కుట్రలు కూడా హిందువుల పండుగ సమయం లోనే ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నారు ?
స్వాతంత్య్రం రాక పూర్వం నుండి చోటు చేసుకొంటున్నపరిణామాలు
బ్రటిష్ ఆక్రమణ సమయంలో ఆగస్టు 1, 1893 సంవత్సరం లో ముంబాయి లో మొదటిసారి హిందువుల పై దాడులుజరిగాయి. ఆ దాడులలో షుమారు 100 మంది చనిపోయినారు 800 మంది గాయాల పాలైనారు . 1921 నుండి 1940 మధ్యకాలంలో దేశం లో అనేకచోట్ల దాడులు జరిగాయి 1926న కలకత్తాలో మొహరం రోజు దాడులు జరిగాయి షుమారు 28 మంది చనిపోయినారు. స్వాతంత్య్రానంతరం కూడా అనేక సంఘర్షణలు జరుగుతున్న వాటి గురించి మరింత అవగాహన పెంచుకొని ఆ దాడులు తిప్పికొట్టేందుకు హిందూ సమాజం ఎందుకు పూర్తిగా సంసిద్ధం కాలేకపోతున్నది? , ఇది ఒక పెద్ద ప్రశ్న. శతాబ్దాలుగా హిందువుల మీద హిందువుల దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, హిందువులను మతం మార్పిడులు కూడా చేస్తూనే ఉన్నారు అయినా ఈ దేశంలోని రాజకీయ నాయకులు హిందువులే మతోన్మాదులు గా హిందూ సంస్థలను మతతత్వ సంస్థలు గా చూపించేందుకు ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు?. ఒక ప్రక్క భారత్ ను ఇస్లాం దేశంగా మార్చాలని శతాబ్దాలుగా తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి , మరో ప్రక్క తమ రాజకీయ అధికారం కోసం ఆ మతోన్మాద శక్తులకు పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తూ పనిచేస్తున్న వివిధ సిద్ధాంతాల వాళ్ళు, వివిధ రాజకీయ పక్షాల వాళ్ళు లో అత్యధికులు హిందువులే ఎందుకు ఇట్లజరుగుతున్నది అని ఎవరైనా ఆలోచిస్తున్నారా ?. శతాబ్దాలుగా భారత్ ను ఇస్లాం దేశం గా మార్చే ప్రయత్నాల్లో భాగంగానే స్వాతంత్రం సమయంలో ఈ దేశం ముక్కలు చేయబడి పాకిస్తాన్ గా ఏర్పడి, తదుపరి కాలంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ లు మారి దేశ సరిహద్దులలోఉన్నాయి, ఈ దేశం మీద నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నాయి, ఇటువంటి శక్తులకు అండదండలు అందిస్తున్న రాజకీయ నాయకుల స్వభావం ఇప్పటికిమారలేదు . మొన్నటికి మొన్న రామనవమి హనుమజ్జయంతి రాలీలపై జరిగిన దాడులకు హిందువులే కారణమంటూ మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా పేరుతొ ఒక కథనం వచ్చింది అంతేకాక దేశంలోని 13 పార్టీలు ఒక సంయుక్త ప్రకటన కూడా చేసారు ఆ ప్రకటనను ఒకసారి గమనిద్దాము..
” 13 పార్టీల సంయుక్త ప్రకటన: దేశంలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు, విద్వేషపూరిత ప్రకటనలపై దేశంలోని విపక్ష పార్టీలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజలంతా సంయమనంతో శాంతి సామరస్యాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చాయి. ఈ మేరకు దేశంలోని 13 విపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఆహారం, వేషధారణ, నమ్మకాలు, పండుగలు, భాష ఆధారంగా సమాజం చీలిపోతున్నట్లు విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. మతోన్మాదుల మాటలు, చర్యలను ఖండించకుండా ప్రధాని మౌనం వహించడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పేర్కొన్నాయి. ఈ మౌనమే సంఘ వ్యతిరేక శక్తులకు అస్త్రంగా మారుతోందని మండిపడ్డాయి. శతబ్దాల పాటు దేశం సుసంపన్నంగా విలసిల్లేందుకు కారణమైన సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు సమష్టి కృషి చేస్తామని 13విపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన ద్వారా హామీ ఇచ్చాయి. సంయుక్త ప్రకటన చేసిన పార్టీల అధినేతల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోపాటు, ఎన్సీపీ అధినేత శరద్పవార్, బంగాల్, తమిళనాడు, ఝార్ఖండ్ సీఎంలు ఉన్నారు.” దీనిని చూస్తూఉంటే మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఇంకనడుస్తూనే ఉన్నాయని అర్ధం కావటం లేదా ? దేశంలో మైనారిటీల రక్షణ కోసం స్వాతంత్రం వచ్చిన దగ్గరనుండి జరుగుతున్న ప్రయత్నాలలో పరాకాష్టగామన్మోహన్ సింగ్ ప్రధానిగా కమ్యూనల్ వాయలెన్స్ బిల్ తెచ్చే ప్రయత్నం, ఇన్ని చూస్తూ కూడా హిందువులు పూర్తిగా రాజకీయంగా ఏకం కాకపోవటం ప్రపంచానికే ఆశ్చర్యం కలిగిస్తోంది . అంటే హిందూ సమాజం రాజకీయాలను ఈ దేశానికి అనుకూలంగా నడిపించడంలో విఫలం అవుతూనే ఉన్నదనేది ఒక చారిత్రక సత్యం.
హిందువుల పండుగ లే ఎందుకు లక్ష్యం గా మారుతున్నాయి ?
హిందువుల పండుగల రోజునే హిందువుల పై దాడులు జరిపించడానికి ఎవరు అంత పెద్దగా సంకోచ పడటం లేదు అనేది చరిత్ర చెప్పే సత్యం . మొన్నటికి మొన్నటి కి శ్రీరామనవమి, హనుమజ్జయంతి సందర్భంగా జరిగిన ఊరేగింపు ల పై దాడులు జరిగాయి. ఆ దాడులను ఖండించ వలసిన నాయకులు దాడులను ఖండించ కుండా దేశంలో మతోన్మాదం పెరుగుతుందని, ఆహారం, వేషాలు, భాషలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాడులు చేస్తున్నారని అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా శరద్ పవార్ మమతా బెనర్జీ మొదలైన 13 పార్టీలకు చెందిన నాయకులూ ప్రజలకు మతోన్మాద శక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని ఒక విజ్ఞప్తి చేశారు. కళ్లముందు కనబడుతున్న సత్యాన్ని అది సత్యం కాదు అని చెప్పేందుకు ఎంత ధైర్యం గా ముందుకు వచ్చారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా 2024 ఎన్నికల తయారీలో కాంగ్రెస్ పంచన చేరేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్న ప్రశాంత్ కిషోర్ అప్రకటనవెనుక ఉన్న మనం పెద్దగా ఆశ్చర్య పడవలసిన దేమి లేదు. . శతాబ్దాలుగా ఈ దేశంలో పోలీసు వ్యవస్థ రాజకీయ అధికారం చేతిలో మగ్గిపోతున్నది వాళ్లు కూడా దాడులను అదుపు చేయడంలో విఫలం కావట మే కాదు వాళ్ళుకూడా దాడులకు గురిఅవుతున్నారు, దానికి ఉదాహరణ చెప్పాలంటే మొన్నటి దాడులలో పోలిసుల పై కూడా దాడులు జరిగాయి అనేకమంది గాయాల పాలైనారు . ఈ దేశంలోని పాలన వ్యవస్థ తో పోటీ పడుతూ న్యాయ వ్యవస్థ కూడా మైనారిటీలకు అండదండలు అందించేందుకు ఉత్సాహం చూపిస్తోంది అందుకే మొన్నటికి మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ బహిరంగ సభలో వేలమంది ముందు మాట్లాడిన విషయానికి ఆధారాలు లేవు అంటూ కేసు కొట్టి వేయటం ఒక తాజా ఉదాహరణ. హిందువుల పండుగలైన గణపతి ఉత్సవాలు దీపావళి, హోలీ మొదలైన కార్యకలాపాలపై ఆంక్షలు విధించేందుకు కూడా ఉత్సాహం చూపించడం కనపడుతూ ఉంటుంది, దానికి రకరకాల కారణాలు చూపిస్తుంటారు దీపావళి టపాకాయలు వాతావరణ కాలుష్యాన్ని పెంచవా అని ప్రశ్నించే ప్రబుద్ధులు కూడా ఉన్నారు , దీని వెనుక ఈ దేశం బలహీనం కావాలని, విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పన్నే శక్తులు శక్తివంతంగా పని చేస్తూనే ఉన్నాయి, ఈ దేశంలో హిందువుల సామాజిక చైతన్యాన్ని విచ్ఛన్నం చేసేవారు కనబడుతుంటారు, అటువంటి ప్రయత్నాలు చేస్తున్నవారికి అండదండలు అందించే శక్తులను, వ్యవస్థలను హిందువులు పూర్తిస్థాయిలో ఎదుర్కోవలసి సమయం ఇప్పటికే మించి పోయిందా? హిందువులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇస్లాం దాడుల చరిత్ర మనకు ఏమి పాఠం నేర్పిస్తున్నది?
భారతదేశంలో దేవాలయం అంటే కేవలం దేవుడు భక్తి పూజ ఆధ్యాత్మికం మాత్రమే కాదు దాని వెనుక సంగీతము సాహిత్యము కళలు విద్య ఉపాధి సామాజిక చైతన్యం మొదలైనవి అనేకం ఉంటాయి అందుకే ముస్లిం దురాక్రమణదారులు దేవాలయాలను ధ్వంసం చేస్తే హిందువులను బలహీనం చేయవచ్చు అనే ఆలోచనతో శతాబ్దాలుగా దేవాలయాల విధ్వంస కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు .భారతదేశ స్వతంత్ర పోరాట సమయంలో దేశం ఒక పక్క స్వతంత్రం కోసం పోరాడుతుంటే విదేశీ దురాక్రమణ దారుల వారసులం అనుకునే ముస్లింలు ఈ దేశంలో తమకు ఒక దేశం నిర్మాణం చేసుకునేందుకు కావలసిన ప్రయత్నాలను సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తూ విధ్వంసం రచన చేయటం మన చరిత్ర చెబుతున్న సాక్ష్యం, హిందువులను భయభ్రాంతులను చేయటం మతం మార్చడం లేకపోతే వెళ్ళగొట్టడంచేస్తుంటారు. ఉదాహరణకు 1946 సంవత్సరంలో బంగ్లాదేశ్ లో లక్ష్మీ పూజలు జరుగుతున్న వేళ దాడులు చేసారు దానికొనసాగింపు మొన్నమొన్నటి 2021 సంవత్సరం దుర్గా పూజ సమయంలో దాడులు జరిగాయి. ఇటువంటి దాడులకు నిర్దిష్ట లక్ష్యాలు ఉంటాయి, ఈ దాడుల మూలా కారణాలను మనం ఆలోచించకుండా ఈ శక్తులను ఎదుర్కో లేము, ఈ దేశంలో హిందువులు సమైక్యంగా ఒక రాజకీయ శక్తిగా నిలబడవలసిన సమయం ఆసన్నమైయింది హిందువులను సామాజికంగా మతపరంగా, రాజకీయంగా చీల్చే కుట్రలను ఎదుర్కునేందుకు హిందూ సమాజం జాగృతం కావాలి. ఈ దేశం ఒక దేశం కాదు ఒక జాతి కాదు హిందుత్వం అంటేమతతత్వం అని ప్రచారం చేసే కుహనా లౌకిక వాదులు వామపక్ష సిద్ధాంత వాదులు ఉదారవాదులు దేశమంతా నిండిపోయారు వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఈ పేరుతో ఒక ప్రక్క మైనారిటీలను రెచ్చగొట్టడం చేసుకుంటూ వస్తున్నారు. రెండవప్రక్క హిందువులను చీలుస్తున్నారు ఇటువంటి వ్యక్తులు, శక్తులకారణంగా ఇప్పటికే దేశం ఎంతో మూల్యాన్ని చెల్లించుకున్నది, దేశాన్ని ముక్కలు కూడా చేసుకున్నాం, ఇంకా దాడులు చేయించుకొంటూనే ఉన్నాము ఈ పరిస్థితులను చక్కదిద్ది విభజన రాజకీయ భేద తంత్రాలను చిత్తు చేయకుండా ఇటువంటి మతోన్మాద ఉగ్రవాద శక్తులను అడ్డుకోవడం అంత సులభం కాదు, ఈ విషయాలను హిందువులు ఇప్పటికైనా గ్రహిస్తారో వేచి చూడాలి. చిల్లర రాజకీయాలకు తెరదించి జాతీయ రాజకీయ శక్తులను శక్తి వంతం చేయడం ఇప్పటి తక్షణ అవసరం అని హిందువులు గుర్తించాలి.
Courtesy :- NewsBharatiyam
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)