గత కొద్ది రోజులుగా మన ఫేస్ బుక్ లో కమ్యూనిస్ట్ లు దేశ ద్రోహులు అంటూ RSS వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు.
అలా అనిపించుకోడానికి కమ్యూనిస్ట్ లే ఆ అవకాశం ఇచ్చారు అంటూ ఒక చర్చ నడుస్తోంది.
సరే! అసలు దేశ ద్రోహులు అని ఎవరిని పిలుస్తాం సాధారణంగా? ఎవరి చర్యలు అయితే దేశ ప్రయోజనాలకు భిన్నంగా ఉంటాయో వారిని దేశ ద్రోహులు అనవచ్చు. మనకు శత్రు దేశంతో యుద్ధం జరుగుతున్నపుడు శత్రు దేశం సిద్దాంతాలు మన సిద్ధాంతాలు ఒక్కటే అని స్వంత దేశానికి కాక శతృదేశానికి మద్దత్తు ఇస్తే వారిని ఎలా పిలవాలి? దేశ భక్తులు అనా? దేశ ద్రోహులు అనా? పోనీ ఒక సంఘటన అయితే సరిపెట్టుకోవచ్చు. కానీ మనం పుట్టి జీవిస్తున్న దేశ హితం ముఖ్యమా నీ విదేశీ సిద్దాంతం ముఖ్యమా అంటే ప్రతీ సారీ దేశ ప్రయోజనాలు కంటే విదేశీ సిద్దాంతం వైపు మొగ్గు చూపితే? వారిని ఏమనాలి?
భారత కమ్యూనిస్టుల గత చరిత్ర చూద్దాం. ఎప్పుడెప్పుడు ఏ సమయాలలో భారత్ ప్రయోజనాలు కంటే తమ విదేశీ సిద్దాంతం ముఖ్యం అని అనుకున్నారో తెలుస్తుంది.
భారత్ చైనా ఉద్రిక్తల మధ్య గత సంవత్సరం జరిగిన అఖిలపక్ష సమావేశంలో, చైనీయులకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేస్తున్న సంఘర్షణలో పార్టీలకు అతీతంగా అందరు రాజకీయ నాయకులు మద్దతు ఇస్తుండగా, ఇద్దరు ఆహ్వానితులు మాత్రం వేరేగా స్పందించారు. వారే సీతారాం ఏచూరి మరియు డి. రాజా. ఈ ఇద్దరు కమ్యూనిస్ట్ నాయకులు సంఘీభావ ప్రదర్శన మీటింగ్ లో మౌనంగా ఉన్నారు, కానీ పంచశీల సూత్రాలను, ఇండో-చైనా స్నేహాన్ని ఉటంకిస్తూ ఈ మొత్తం కుట్రకు కారణం అమెరికా అని నిందించారు.
కమ్యూనిస్టుల ఈ వైఖరి కొత్తదేమీ కాదు. చారిత్రాత్మకంగా, వారు భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమైన ప్రకటనలు మరియు కార్యకలాపాలలో పాల్గొంటునే ఉన్నారు.
మార్క్సిజం యొక్క భావజాలం ఆధారంగా మరియు లెనిన్ చే విస్తృతంగా ప్రభావితమైన, SV ఘాటే 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) స్థాపనకు నాయకత్వం వహించారు. CPI యొక్క డిమాండ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి స్వాతంత్య్రం పొందడమే కాకుండా పెట్టుబడిదారీ బూర్జువాను పడగొట్టడం కూడా.
అంతకుముందు బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో పోరాడుతున్న CPI, జూలై 1942లో నాజీ జర్మనీకి వ్యతిరేకంగా రష్యా దేశం బ్రిటన్కు మిత్రపక్షంగా మారినప్పుడు బ్రిటిష్ పై సీపీఐ వైఖరి మారింది. కమ్యూనిస్టుల మాతృభూమి సోవియట్ రష్యా బ్రిటన్కు మిత్రదేశంగా మారినప్పటి నుండి కమ్యూనిస్టులు జాతీయ ఉద్యమ రాజకీయాల ప్రధాన స్రవంతి నుండి తమకు తాము దూరంగా ఉండడం ప్రారంభించారు. అంతేకాదు బ్రిటిష్ పాలనను స్నేహపూర్వక శక్తిగా చూడటం కూడా ప్రారంభించారు. అయితే క్విట్ ఇండియా ఉద్యమానికి కమ్యూనిస్టులు వ్యతిరేకంగా ఉండటంతో రాజకీయంగా వారు పక్కన పెట్టబడ్డారు.
కొన్ని రోజుల తర్వాత, CPI ప్రధాన కార్యదర్శిగా ఉన్న B. T. రణడివే నాయకత్వంలో CPI పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఆందోళన చేయడం ప్రారంభించింది. 1947 లో మనకు వచ్చిన స్వాతంత్య్రం నకిలీదని(యే ఆజాదీ ఝూటీ హై) పేర్కొంటూ భారతదేశ స్వాతంత్య్రాన్ని ప్రశ్నించింది . భారతదేశంలోని ప్రస్తుత పరిస్థితి సాయుధ విప్లవానికి తగినదని అప్పట్లో వారు వాదించారు.
సెప్టెంబరు 30, 1949న చైనాలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) చైర్మన్ మావో త్జే-తుంగ్ అధికారంలోకి రావడంతో, CPIలోని ఒక వర్గం USSR నుండి చైనా వైపు దృష్టి సారించింది మరియు మావో మార్గాన్ని కాపీ చేయడం ప్రారంభించింది. 1959 నాటికి, CCP ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమం అంతటా మరియు భారతీయ కమ్యూనిస్ట్పై తన ప్రభావాన్ని బలోపేతం చేయడానికి దాని గట్టి ప్రయత్నాలను ప్రారంభించింది.
1960ల నాటికి, మాస్కో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ (CPSU) మరియు చైనీస్ CCP మధ్య వివాదం ముదిరిపోయింది. CPIలోని ఎడమ వర్గం CCPకి మద్దతుగా ఉంది, అయితే కుడి వర్గం ఇప్పటికీ CPSU నుండి ఆదేశాలు తీసుకుంటోంది. 1961 చివరి నాటికి, CPI పార్టీ యొక్క కుడి-పక్షం CCPని బహిరంగంగా విమర్శించే స్థాయికి చేరుకుంది. మరోవైపు CPI వామపక్షం చైనీయులపై నెహ్రు వైఖరికి మద్దతుగా ప్రకటనలు ఇచ్చేది.
కానీ చైనా మరియు భారతదేశం మధ్య సంబంధాలలో చీలిక సంభవించినప్పుడు, CPI కూడా దాని సభ్యుల మధ్య చీలికను ఎదుర్కొంది. సీపీఐ వామపక్ష వర్గం దేశ ప్రయోజనాల కంటే వారి భావజాలానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
CPI నాయకుడు EMS నంబూద్రిపాద్ చైనా దురాక్రమణదారు అని నమ్మను అని చెప్పి చైనా దురాక్రమణ ను సమర్ధించడానికి భారతదేశాన్నే దురాక్రమణదారుగా పేర్కొన్నాడు.
EMS మాటల.లోనే ” మన దేశ పాలక వర్గాల వర్గ విధానమే టిబెటన్ విప్లవవాదులను వారికి మిత్రులుగా చేసింది. అదే భారత-చైనా సంబంధాలలో క్షీణత ప్రక్రియను ప్రారంభించిందనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని మేము గుడ్డిగా మారడానికి సిద్ధంగా లేము. అక్టోబరు, 1962 నాటి చైనా దాడికి భారత్ బాధ్యత వహించాలని, చైనా దాడికి ముందు వారాల్లో ఇలా రెచ్చగొట్టే వైఖరిని అవలంబించిన భారత పాలక వర్గాలు కూడా ఈ నిందను పంచుకోవాలనే మా అభిప్రాయాన్ని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము”
యుద్ధం ముగిసిన తర్వాత కలకత్తాలో జరిగిన ఒక బహిరంగ ర్యాలీలో జ్యోతిబసు “చైనా దురాక్రమణదారు కాజాలదు” అని ప్రకటించారు. సరిహద్దు వివాదం మరియు యుద్ధానికి రెచ్చగొట్టడంపై భారత నాయకత్వం యొక్క మొండి వైఖరిని కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు చాలా మంది నిందించారు.
‘చైనీస్ అనుకూల వర్గం’ యొక్క అనుభవజ్ఞుడైన తుషార్ కాంతి రాయ్, పార్టీలో ఒక అడుగు ముందుకు వేసి, “చైనా మన దేశం నుండి భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఇష్టపడుతుందని మేము ఎప్పుడూ నమ్మలేదు” అని అన్నారు.
మరోవైపు, సిపిఐ నాయకుడు శ్రీపాద్ అమృత్ డాంగే, నంబూద్రిపాద్తో విభేదించారు. ఆయన భారతదేశ వాదానికి మద్దతు ఇచ్చారు.
కమ్యూనిస్టుల ఈ చైనా అనుకూల వైఖరి అనేకమంది కమ్యూనిస్టు నాయకులను కటకటాల వెనక్కి నెట్టడానికి భారత ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. తమ సహచరులను చైనీస్ ఏజెంట్లని ఆరోపిస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అని VS అచ్యుత్యానందన్ భారత జవాన్ల కోసం కమ్యూనిస్ట్ కేడర్ రక్తదానం చేయాలనే ఆలోచనను ముందుకు తెచ్చారు. కానీ ఈ ఆలోచననూ అతని ఇతర సహచరులు వ్యతిరేకించారు. పార్టీ కూడా అతనిని పార్టీలో తక్కువ పదవికి మార్చింది.
పార్టీలోని ఈ విభేదాలు 1964లో CPIని CPI మరియు CPI-Mగా విభజింప బడడానికి దారితీసింది. 1961 నవంబరు 6వ తేదీన జాతీయ కౌన్సిల్లోని వామపక్ష సభ్యులు అందరూ ఒకే పార్టీలో ఉండలేరు అనే బసవపున్నయ్య తీర్మానాన్ని సమర్ధించి 1962 ఎన్నికల తర్వాత విడిపోవాలి అని తీర్మానించారు. చైనీయులకు అనుకూలమైన వారు మాతృపార్టీని విడిచిపెట్టి, సిపిఐ-ఎం పేరుతో కొత్త పార్టీని స్థాపించగా భారతదేశానికి మద్దతు ఇస్తున్న వారు మాతృపార్టీలోనే
ఉండిపోయారు.
1947 ఆగస్టు 15న బ్రిటీష్ వారి నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటికీ, భారతదేశంలోని కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పటికీ సోవియట్ యూనియన్ మరియు చైనా వంటి ఇతర దేశాల నుండి ఆదేశాలు తీసుకుంటూనే ఉన్నారు. వారు అటువంటి ఆదేశాలు తీసుకోవడం మరియు వారి సిద్ధాంతాలను అనుసరించడమే కాక భారతదేశంలో వారి పార్టీ అభివృద్ధి గురించి వారికి నివేదిస్తూ వుంటారు. భారతదేశం-చైనా యుద్ధంలో CPI పాత్ర దేశద్రోహి కంటే తక్కువ కాదు.
పాత రోజుల్లోనే కాదు, ఇప్పుడు రెండు కమ్యూనిస్ట్ పార్టీలు చైనా అనుకూల వైఖిరే అవలంబిస్తున్నారు. వారికి పెట్టుబడి దారీ అమెరికా బద్ద శత్రువు కాబట్టి భారత్ చైనా వైపు ఉండాలని ఈ పార్టీల కోరిక.
స్వాతంత్రం వచ్చిన దగ్గరనుండి చైనా భారత్ సరిహద్దులను అలా అక్రమించుకుంటూ వస్తున్నా ఏ భారత వామపక్ష నేతా చైనా దుందుడుకు ఆక్రమిత వైఖరి కి వ్యతిరేకంగా ఏ ఒక్క రోజూ స్టేట్మెంట్ ఇవ్వలేదు. పై పెచ్చు మోడీ వచ్చాక భారత సైన్యం సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలను అడ్డుకుంటోంది అని,
RSS అమెరికా కుమ్మక్కు అయి మా చైనా ను భారత దేశం ఇబ్బందులకు గురి చేస్తోంది అని సీపీఎం సీనియర్ నేత కేరళ ముఖ్యమంత్రి పిన్నరయి రవి భోరున విలపించాడు. మొన్న చైనా కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలు అప్పుడు మన వామపక్ష నేతలు చైనాను ఆకాశానికి ఎత్తేశారు.
అసలు అక్కడ ప్రజాస్వామ్యం లేదు పచ్చి నియంతృత్వమ్ లో ప్రజలకు, మీడియాకు, న్యాయవ్యవస్థ కు కనీస హక్కులు ఉండవు, ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించే సాహసం చేయరు. ఈ దేశంలో అన్ని హక్కులూ అనుభవిస్తున్న ఈ వామపక్షాలు చైనాను ఆకాశానికి ఎత్తేస్తారు. భారత ప్రజలు వెర్రి వాళ్ళు అనుకుని ఇన్నాళ్లు వారి బుర్రలు బ్రెయిన్ వాష్ చేద్దాం అనుకున్నారు. సోషల్ మీడియా వచ్చి వారి ద్వంద ప్రమాణాలను, హిపోక్రసీ ని బయట పెడుతూ ఉండటం తో ప్రజలకు వీరి నిజ స్వరూపం తెలుస్తూ ఇంకా ఇంకా దూరం పెడుతున్నా వీరి వైఖరి లో మార్పు రావడం లేదు.
“ఒక దేశం దాని మూర్ఖులను మరియు అత్యాశపరులను కూడా భరిస్తూ మనగలదు. కానీ అది లోలోపల ఉండే దేశద్రోహంతో మనుగడ సాగించలేదు.” ~ మార్కస్ తుల్లియస్ సిసిరో
ఇప్పుడు చెప్పండి ఈ కమ్యూనిస్టులను దేశ ద్రోహులు అంటే తప్పు ఉందా?
Courtesy :- Chada Shastry



