
ఏపీలో కనీస మౌలిక సదుపాయాలు లేవని…కరెంట్, నీళ్లు, రోడ్లు కూడా లేవని మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ క్రెడాయ్ ఆధ్వర్యంలో .. హెచ్ఐసీసీ లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్ పో షోను ప్రారంభ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు వంటివీ లేవని.. సీఎం కేసీఆర్ తన దక్షత, సమర్థతతో పదవిలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్ కొరతను తీర్చారు అని అన్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, గృహాలకు 24 గంటలూ కరెంటు ఇచ్చే దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
తన మిత్రుడు ఒకాయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి వెళ్లాడని…. వాళ్లకు అక్కడ తోటలు, ఇల్లు ఉన్నాయని…. వెళ్లి వచ్చిన తర్వాత తనకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితి వివరించాడనీ చెప్పారు.
‘నాలుగు రోజులకోసం వెళ్లి అక్కడ ఉండలేకపోయాను. అక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయి అధ్వానంగా ఉంది పరిస్థితి. మళ్ళీ తిరిగి వచ్చాకే ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది” అని అన్నారని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు, కొన్ని మాటలంటే కొందరికి నచ్చకపోవచ్చు, కానీ మీరే వెళ్లి చూడండి, వచ్చి మీరే మమ్మల్ని అభినందిస్తారు అని అన్నారు.
ఏపీలో మౌలిక సదుపాయాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పక్క రాష్ట్రంలోనే అవేంలేవన్నారు. హైదరాబాద్లోనే కరెంట్ లేదని, స్వయంగా తనకే ఆ అనుభవం ఎదురైందని కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. ఏపీ గురించి కేటీఆర్కు ఎవరో స్నేహితుడు చెప్పాడేమో కానీ తాను నిన్నటి వరకు హైదరాబాద్లోనే ఉన్నాననీ అన్నారు. జనరేటర్ వేసుకొని ఉండివచ్చానన్నారు. తెలంగాణలో పరిస్థితులను ప్రత్యక్షంగా చూసినప్పటికీ తాను ఎవరికి చెప్పడం లేదు కదా అని వ్యాఖ్యానించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వెంటనే కేటీఆర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవు : కేటీఆర్ – హైదరాబాద్ లోనే అవేం లేవు : బొత్స
ఏపీలో కనీస మౌలిక సదుపాయాలు లేవని…కరెంట్, నీళ్లు, రోడ్లు కూడా లేవని మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ క్రెడాయ్ ఆధ్వర్యంలో .. హెచ్ఐసీసీ లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్ పో షోను ప్రారంభ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు వంటివీ లేవని.. సీఎం కేసీఆర్ తన దక్షత, సమర్థతతో పదవిలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్ కొరతను తీర్చారు అని అన్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, గృహాలకు 24 గంటలూ కరెంటు ఇచ్చే దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
తన మిత్రుడు ఒకాయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి వెళ్లాడని…. వాళ్లకు అక్కడ తోటలు, ఇల్లు ఉన్నాయని…. వెళ్లి వచ్చిన తర్వాత తనకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితి వివరించాడనీ చెప్పారు.
‘నాలుగు రోజులకోసం వెళ్లి అక్కడ ఉండలేకపోయాను. అక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయి అధ్వానంగా ఉంది పరిస్థితి. మళ్ళీ తిరిగి వచ్చాకే ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది” అని అన్నారని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు, కొన్ని మాటలంటే కొందరికి నచ్చకపోవచ్చు, కానీ మీరే వెళ్లి చూడండి, వచ్చి మీరే మమ్మల్ని అభినందిస్తారు అని అన్నారు.
ఏపీలో మౌలిక సదుపాయాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పక్క రాష్ట్రంలోనే అవేంలేవన్నారు. హైదరాబాద్లోనే కరెంట్ లేదని, స్వయంగా తనకే ఆ అనుభవం ఎదురైందని కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. ఏపీ గురించి కేటీఆర్కు ఎవరో స్నేహితుడు చెప్పాడేమో కానీ తాను నిన్నటి వరకు హైదరాబాద్లోనే ఉన్నాననీ అన్నారు. జనరేటర్ వేసుకొని ఉండివచ్చానన్నారు. తెలంగాణలో పరిస్థితులను ప్రత్యక్షంగా చూసినప్పటికీ తాను ఎవరికి చెప్పడం లేదు కదా అని వ్యాఖ్యానించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వెంటనే కేటీఆర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Share: