నెల్లూరులో ఆదివారం జరిగిన హనుమాన్ శోభా యాత్రపై దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. పెద్దసంఖ్యలో ఓ వర్గం ర్యాలీ తీస్తున్న హనుమాన్ భక్తులపై దాడికి దిగింది. దాడిలో పలువురికి గాయాలైనట్టు తెలిసింది. శాంతియుతంగా యాత్ర తీస్తున్న తమపై దాడి చేసిన నిందితులను పట్టుకుని శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక యూపీ, మధ్యప్రదేశ్ లోలాగా తమకూ బుల్డోజర్ తో న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. వైఎస్ జగన్ హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని..హిందువుల సహనాన్ని పరీక్షిస్తున్నారని… బీజేపీ జాతీయ కార్యదర్శి ఏపీ కో ఇన్ చార్జ్ సునీల్ దేవధర్ అన్నారు.
ఈమేరకు ఫొటోలను జతచేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘హనుమాన్ శోభా యాత్ర’పై అక్రమ మసీదు నుంచి రాళ్లదాడి జరిగింది. ఆ సమయంలో అక్కడున్న హిందువులు ఎంతో ఆందోళన చెందారు. దుండగులు హనుమాన్ విగ్రహంపై బీరు బాటిళ్లను విసిరారు. ఇది హిందువులకు అవమానించడమేృ. ఎంతకాలం హిందువుల సహనాన్ని పరీక్షిస్తారు జగన్ . ఏపీలో కూడా బుల్డోజర్ జస్టిస్ కావాలని కోరుకుంటున్నాం ?.. అని సునీల్ దేవధర్ ట్వీట్ చేశారు.
https://twitter.com/Sunil_Deodhar/status/1518622157013610496?s=20&t=nfYKmXNfnHXznrV8mSnA-Q
హనుమాన్ జయంతి శోభాయాత్రను టిటిడి కల్యాణ మండపం నుంచి స్టోన్హౌస్ పేట్ ప్రాంతం వరకు కొనసాగించారు. శాంతియుతంగా జరిగిన ఈ ఊరేగింపులో 15,000 మందికి పైగా హిందువులు పాల్గొన్నారు. ఊరేగింపు జిల్లా కోర్టు రహదారి గుండా వెళుతుండగా సమీపంలోని మసీదు నుంచి ఇస్లాంవాదులు ఊరేగింపుపై రాళ్లు, గాజు సీసాలతో దాడి చేశారని భక్తులు చెప్తున్నారు. ఇస్లామిక్ నినాదాలు చేశారనీ అంటున్నారు.
దీనిపై స్పందించిన బిజెపి సునీల్ దియోధర్.. నెల్లూరు జిల్లా కోర్టు సమీపంలో నిర్మించిన మసీదు చట్టవిరుద్ధమని, రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాన్ని బుల్డోజర్తో తొలగించాలని పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలోని జహంగీర్పురితో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఆక్రమణ వ్యతిరేక డ్రైవ్ను ప్రస్తావించిన ఆయన, మత ఘర్షణల్లో పాల్గొన్న వారి ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేయాలని సీఎంను కోరారు.
అసలైతే ఆ నిర్మాణానికి సంబంధించి హైకోర్టు నాలుగేళ్ల క్రితం తొలగింపు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని స్థానిక బీజేపీ నేతలంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటన జరిగితే హిందువులు మౌనంగా ఉండరని రెడ్డి హెచ్చరించారు. నగరంలో సంఘ విద్రోహశక్తులపై న్యాయస్థానంలో పిటిషన్ వేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, నగరంలో మతసామరస్యాన్ని కాపాడాలంటూ జిల్లా కలెక్టర్ కు నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఇక శోభాయాత్రకు నేతృత్వం వహించిన వాళ్లపై సోషల్మీడియాలో యుద్ధం ప్రకటించింది అవతలి వర్గం. ఆర్ఎస్ఎస్ ముఖ్యులు బయ్యా శ్రీనివాసులు, కందుకూరిసత్యం సహా పలువురు అంతా తామై ర్యాలీ తీశారు. అయితే బయ్యా శ్రీనివాసులుకు సంబంధించి శుభమస్తు, కందుకూరికి చెందిన కందుకూరి షాపింగ్ మాల్స్ లో ఎలాంటి కొనుగోళ్లు చేయవద్దని నెల్లూరులో ఫత్వా జారీ చేశారు. వస్త్రాలు మాత్రమే కాదు రంజాన్ షాపింగ్ కోసం ఏ హిందువుల దుకాణాలకూ వెళ్లవద్దని కొందరు సోషల్మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే నెల్లూరులోనే అతిపెద్ద వస్త్రాలయం తనది అని ..తన దగ్గరున్న 1200 మంది వర్కర్స్ లో 300మంది ముస్లింలే ఉన్నారని శ్రీనివాసులు చెబుతున్నారు. కొందరు కావాలనే ర్యాలీపై దాడి చేశారని. ప్రశాంతంగా ఉన్న సింహపురిలో అల్లర్లు రేపే కుట్ర జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)