ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారిందన్న కేంద్రం తాజా నివేదిక కలకలం రేపుతోంది. స్మిగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం.. కేంద్ర బలగాలు ఎక్కువగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది ఏపీలోనే. 2021-22 ఏడాదిలో దేశంలో పట్టుబడిన డ్రగ్స్పై కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఈ తాజా నివేదికలో పేర్కొంది. ఏపీలో మొత్తం 18వేల 267 కిలోల ల డ్రగ్స్ను సీఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకుందని వెల్లడించినన ఆర్థికమంత్రిత్వ శాఖ..ఒకవెయ్యి 57 కిలోల గంజాయితో పాటు.97 కోట్ల విలువైన 165 టన్నుల ఎర్ర చందనాన్ని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయని తెలిపింది. ఇక తెలంగాణలో వెయ్యి 12 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.