ఏపీకి చెందిన ఐఏఎస్ లకు కోర్టుధిక్కరణకేసులో శిక్ష విధించింది ధర్మాసనం.
మొత్తం 8 మంది ఐఏఎస్ లకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. గ్రామ సచివాలయ భవనాలను హైస్కూల్ ప్రాంగణాల్లో, ఇతర ప్రభుత్వ స్థలాల్లో నిర్మించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ… వాటిని వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే న్యాయస్థానం ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కరణ కేసును ఇనీషియేట్ చేసిన ధర్మాసనం గురువారం విచారణను ప్రారంభించింది.
విచారణ అనంతరం ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. అధికారులకు 2 వారాలపాటు జైలు శిక్ష విధించింది. దానిపై స్పందిస్తూ అధికారులు కోర్టును క్షమాపణలు కోరారు. దీంతో జైలు శిక్షను తప్పించి సంవత్సరం పాటు సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒక రోజు వెళ్లి సేవ చేయాలని ఆదేశాలిచ్చింది. విద్యార్థుల మధ్యాహ్నం, రాత్రి భోజన ఖర్చులు భరించాలని, ఒక రోజు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశించింది.
ఆ 8 మంది జాబితాలో సీనియర్ ఐఏఎస్లు విజయ్కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజాశంకర్, వాడ్రేవు చినవీరభద్రుడు సహా ఎంఎం నాయక్ ఉన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)