సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గత నెలలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు సీఎంస్ సమీర్ శర్మ ఆయనకు నోటీసులు ఇచ్చారు.
ఆలిండియా సర్వీస్ రూల్స్ లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం పెట్టారని..అందుకు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా మీడియా సమావేశం పెట్టడం తప్పేనంటూ…మెమో అందిన వారంలో వివరణ ఇవ్వకుంటే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
గత నెలలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడుతూ …గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు పెగాసస్ కొనుగోలు చేశారన్న వ్యాఖ్యతో దుమారం రేగింది. ఆరోపించడంతో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసింది.దీనిపై మార్చి 21న మీడియా సమావేశం నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావు.. గత ప్రభుత్వ హయాంలో పెగాసస్ ను కొనలేదని.. ఈ విషయాన్ని డీజీపీ కార్యాలయమే స్పష్టం చేసిందంటూ ప్రెస్ మీట్లో చెప్పారు. తనను ఇరికించడం కోసం అధికారులు విఫలయత్నం చేస్తున్నారనీ మండిపడ్డారు. అంతేకాదు అంతేకాదు కొన్ని మీడియా సంస్థలుసహా వైసీపీ నాయకులపై పరువునష్టం దావా వేస్తానని ప్రభుత్వ అనుమతి కోరానని చెప్పుకొచ్చారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)