గవర్నర్ బిశ్వభూషణ్ కు ఏపీ ప్రభుత్వం ఘన వీడ్కోలు పలికింది. బిశ్వభూషణ్ తాజాగా చత్తీస్ గఢ్ గవర్నర్ గా నియమితులయ్యారు. 44 నెలలపాటు ఆయన ఏపీ గవర్నర్ గా పనిచేశారు. ఇంతకాలం తనకు సహకరించిన అందరికీ బిశ్వభూషణ్ ధన్యవాదాలు తెలిపారు.సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులు గన్నవరం విమానాశ్రయం వరకు వచ్చి వీడ్కోలు పలికారు. అంతకుముందు దర్బార్ హాల్లో రాజ్ భవన్ ఉద్యోగులు, సిబ్బంది గవర్నర్ దంపతులకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు.