ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 117 రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వ నిర్ణయం జీవో ఏపీడీడీఎఫ్సీఎల్ ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా.. జీవోను సవాల్ చేస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పిటిషన్ వేసేటప్పటికి జీవో జారీ కాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జీవోను సవాల్ చేస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేయాలని సూచించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది