న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాపై లోక్సభలో ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్రాయ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ తో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల అపరిష్కృమైన సమస్యలు చాలా ఉన్నాయని..అయితే కొన్నింటిని తాము పరిష్కరించలేమని… ఆరాష్ట్రాల ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు.