జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యూలోని గోడల నిండా బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కలకలం రేపాయి. వాటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంపై దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. రాతలు తీవ్ర దుమారం రేపడంతో వీసీ ప్రొఫెసర్ శాంతిశ్రీ పండిట్ స్పందించారు. ఇలాంటి చర్యల్ని సహించేది లేదన్నారు. ఈమేరకు యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉపకులపతి శాంతిశ్రీ దీనిపై తీవ్రంగా స్పందించారని…ఇలాంటి ధోరణులను సహించబోమనీ అంది. స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్-2 భవనంపై బ్రాహ్మణ, వైశ్య వ్యతిరేక నినాదాలను గుర్తు తెలియని వ్యక్తులు రాశారని కొందరు విద్యార్థులు తెలిపారు. ‘‘బ్రాహ్మణులు ఈ క్యాంపస్ను విడిచిపొండి’’, ‘‘There Will Be Blood’’, ‘‘బ్రాహ్మణులారా, భారత్ను విడిచిపొండి’’, ‘‘బ్రాహ్మణులారా, వైశ్యులారా, మేం మీ కోసం వస్తున్నాం. ప్రతీకారం తీర్చుకుంటాం’’ అంటూ ఆ రాతలున్నాయి. కమ్యూనిస్టు గూండాలు ఈ విధంగా విద్యా సంస్థల ప్రాంగణాలను నాశనం చేయడాన్ని ఖండిస్తున్నామని ఏబీవీపీ జెఎన్యూ అధ్యక్షుడు రోహిత్ అన్నారు.