ప్రజారవాణాలో రోప్ వే సేవల్ని వినియోగించుకునే మొదటి నగరం ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కానుంది.
ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి వారణాసి రైల్వే స్టేషన్ నుంచి గొడౌలియాలోని చర్చి స్క్వేర్ వరకు నిర్మించాలని ప్రతిపాదించారు. 424 కోట్లు అంచనా వ్యయంగా చెబుతున్నారు.ఈ ప్రాజెక్ట్ పూర్తైతే కాశీ విశ్వనాథ్ ఆలయం ,దశశ్వమేధ్ ఘాట్ సులభంగా చేరుకోవచ్చు.
4.2 కిలోమీటర్ల ఏరియల్ డిస్టాన్స్ ను కవర్ చేసే రోప్ వే …ప్రపంచంలోని ఈ పురాతన నగరంలో ట్రాఫిక్ జామ్ ఇబ్బందిని అధిగమింపచేయడంతో పాటు …పర్యాటకుల సమయాన్ని, డబ్బును ఆదాచేయనుంది.అంతేకాదు ఇది పూర్తైతే… లీవియా, మెక్సికో తరువాత ప్రపంచంలో ప్రజారవాణాకు రోప్ వేవాడుతున్న మూడో దేశం భారత్ అవుతుంది. ప్రధాన టెర్మినస్ కాంట్ రైల్వే స్టేషన్లో ఉంటుంది, ఇతర స్టేషన్లు సాజన్ తిరాహా, రథయాత్ర ,గిర్జాఘర్ (గోడోలియా) క్రాసింగ్లలో ఉంటాయి.రోప్ వే ద్వారా కేవలం 15 నిమిషాల్లో 4.2 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దాదాపు 220
ట్రాలీలతో ఉన్న ట్రాలీ కార్ 45 మీటర్ల ఎత్తునుంచి వెళ్తుంది. ప్రతి కేబుల్ కారులో 10 సీట్లు ఉంటాయి. కార్లు 90 సెకన్ల నుండి 120 సెకన్ల వ్యవధిలో కదులుతాయి.అంటే ఒకేసారి దాదాపు నాలుగువేల మంది ఒకేసారి ఒకేదిశలో ప్రయాణిస్తారు.
రాత్రివేళలోనూ రోప్ వే అందుబాటులో ఉంటుంది. ఇక ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 80శాతాన్ని కేంద్రం, 20 శాతాన్ని రాష్ట్రప్రభుత్వం భరిస్తాయి.మధ్య విభజించబడుతుంది. కాశీలోని కళానైపుణ్యం, మతవిశ్వాసాలు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా రోప్ వే స్టేషన్లు నిర్మిస్తామని వారణాసి డెవలప్ మెంట్ అథారిటీ అంటోంది.