సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్న మనస్థాపంతో మరో వీఆర్ఏ గుండెపోటు తో చనిపోయాడు. వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రాజాపూర్ కు చెందిన 40ఏళ్ల రాజు సమ్మెలో చురుకుగా పాల్గొంటున్నారు. గత రాత్రి తీవ్ర మనోవేదనకు గురైన రాజుకు గుండె నొప్పి రాగా… కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు కుటుంబాన్ని ప్రభుత్వమే అందుకోవాలని వీఆర్ఏ జేఏసీ డిమాండ్ చేస్తోంది. పే-స్కేల్ జీవో విడుదల చేయడంతో పాటు, ఉద్యోగ క్రమబద్దీకరణ చేయాలంటూ గత 60 రోజులుగా వీఆర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.