ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ‘టూల్కిట్ మాడ్యూల్’పై సీబీఐ దృష్టిపెట్టంది. ముంబైలో ఇలాంటి చిరునామాలతో ఢిల్లీలో కొనసాగుతున్న మద్యం లైసెన్సింగ్ కుంభకోణంతో ముడిపడి ఉన్న కార్పొరేట్ కంపెనీల చిట్టా బయటపడింది. డిల్లీ కేసులో సీబీఐ 15మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన కొన్ని రోజుల తరువాత ఇప్పుడు..ఏజెన్సీ అధికారులు టూల్ కిట్ మాడ్యూల్స్ పై దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీల చట్టం కింద మెటీరియల్ సమాచారాన్ని బహిర్గతం చేయలేదని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక అక్రమాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని అయితే గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వ్యాపారవేత్తలు, కమెడియన్లు సహా 50మందికి పైగా వ్యక్తుల విదేశీ చెల్లింపులు, అంతర్జాతీయ ప్రయాణాలపై కేంద్ర ఏజెన్సీ విచారణ జరుపుతోంది. ఈ ఎంటర్టైనర్లకు విజయ్ నాయర్ కు చెందిన
ఓన్లీ మచ్ లౌడర్ (OML) ప్రాతినిధ్యం వహించింది. అలాగే ఢిల్లీలో మద్యం విక్రయించేందుకు లైసెన్స్లు పొందిన హైదరాబాద్కు చెందిన వ్యక్తులు, కంపెనీల క్రిప్టోకరెన్సీలు మరియు షేర్లలో ఆర్థిక లావాదేవీలపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఓన్లీ మచ్ లౌడర్ మాజీ సీఈఓ విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీతో సన్నిహితంగా ఉండేవారని తెలిసింది.
2021-22 సంవత్సరానికి GNCTD ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో , అమలు చేయడంలో చురుగ్గా పాల్గొన్నట్టు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఇక రైతు ఉద్యమాల సందర్భంగా తెరపైకి వచ్చిన టూల్ కిట్ అంశం మరోసారి చర్చనీయాంశం అయింది. ఓ వ్యక్తి, లేదా సంస్థను బెదిరించేందుకు ప్రముఖ వ్యక్తులతో పథకం ప్రకారం ఆన్ లైన్ మూకుమ్మడి దాడి, తప్పుడు ప్రచారం చేయించడమే ఈ టూల్ కిట్. రైతు ఆందోళనల సమయంలో గ్లోబల్ క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్బెర్గ్ ద్వారా మొదట ప్రాచుర్యం పొందింది. 2021లో రైతు నిరసనల సందర్భంగా ట్వీట్లో ‘టూల్కిట్’ను షేర్ చేసిన ఆమె…భారత్ కు వ్యతిరేకంగా ప్రపంచమంతా ప్రచారం చేసింది.
రైతుల ఆందోళనల నేపథ్యంలో భారత్ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆమె తయారుచేసిన జాబితా బయటపడింది. అంతకుముందు, రైతు నిరసనలకు మద్దతుగా రిహన్న, గ్రెటా థన్బర్గ్, మియా ఖలీఫా మరియు కెనడా ఎంపీ జగ్మీత్ సహా ప్రముఖులు, రాజకీయ నాయకులు ముందుకు వచ్చారు. అయితే ఇది భారతదేశంలో అశాంతిని కలిగించే పెద్ద కుట్రలో భాగమని గ్రెటా టూల్ కిట్ వ్యవహారం బహిర్గతం చేసింది.
తరువాత, మే 2021లో, ఒక కొత్త కాంగ్రెస్ టూల్కిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, ఇందులో కుంభమేళాను కరోనావైరస్ కోసం “సూపర్-స్ప్రెడర్” ఈవెంట్గా చిత్రించడానికి ఉద్దేశపూర్వక కథనాన్ని రూపొందించే పథకం సిద్ధమైంది. అదే సమయంలో భారీ ఈద్ సమావేశాలపై మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహించింది.
టూల్ కిట్ మెసేజులను వెంటనే విస్తరింపచేసేందుకు సోషల్మీడియాలోను, మీడియాలో ఉన్న జర్నలిస్టులు చాలా చురుగ్గా ఉండడం అందరూ గమనించారు. ఇక నూపుర్ శర్మ వ్యవహారంలో అంతర్జాతీయస్థాయిలో వ్యాప్తి చేసి భారత్ ను ఇరుకున పెట్టే ప్రయత్నంఎలా జరిగిందో కూడా చూశారంతా.