మూడు రోజుల క్రితం వివాదాస్పద ట్వీట్ చేసిన బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి తాజాగా మరో ట్వీట్ చేశారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావుకు మద్దతుగా ఈసారి ఆయన ట్వీట్ చేశారు. రఘునందనరావును జాతీయ అధికార ప్రతినిధి చేయాలని ఆయన ట్వీట్ చేశారు. కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న రఘునందన్ రావు… బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవిని, జాతీయ అధికార ప్రతినిధి పదవిని ఆశిస్తున్నారు. దీంతో ఆయనకు మద్దతిస్తూ ఆయన చేసిన ట్వీట్ పై పార్టీ వర్గాల్లోచర్చ జరుగుతోంది. ఇక మూడు రోజుల క్రితం..ఓవీడియోను జతచేస్తూ ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. దున్నపోతులను తంతూ ట్రాలీ ఎక్కిస్తున్న వీడియో అది. బీజేపీ నాయకులకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ ఆయన పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. అయితే వైరల్ అవడంతో దాన్ని తొలగించిన ఆయన కాసేపటికే మళ్లీ పోస్ట్ చేశారు.
Proud of your voice. I support you as national spokesperson @blsanthosh @AmitShah @JPNadda @BJP4Telangana pic.twitter.com/3Cvafg7dAn
— AP Jithender Reddy (@apjithender) July 1, 2023