హత్రస్లో మరో దారుణ సంఘటన.. యోగీ కన్నెర్ర..!
Man shot dead in Hathras: Chief Minister Yogi Adityanath directs officials to take strict action in the matter. He has also given directions to invoke National Security Act against all the accused involved in the case.
(File photo) pic.twitter.com/ZWgPHHtDK1
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 2, 2021
యూపీలోని హత్రస్ మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. లైంగిక వేధింపుల కేసులో నెల రోజులు జైల్లో ఉండి వచ్చిన గౌరవ్ శర్మ అనే వ్యక్తి.. బాధితురాలి తండ్రిని కాల్చిచంపేశాడు. సోమవారం నాడు జరిగిన ఈ సంఘటనతో హత్రస్లో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లా పోలీస్ చీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకు సస్నీ అనే ప్రాంతానికి చెందిన గౌరవ్శర్మ అనే వ్యక్తి 2018లో అదే గ్రామానికి చెందిన ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే బాధితురాలి తండ్రి ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ.. తీరు మార్చుకోకపోవడంతో.. బాధితురాలి తండ్రి 2018 జూలైలో గౌరవ్శర్మపై కేసు పెట్టాడు. అయితే ఈ కేసులో గౌరవ్శర్మకు శిక్షపడ్డప్పటికీ.. నెల రోజుల తర్వాత స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అతడు మళ్లీ జైలు నుంచి బయటకు వచ్చి.. మళ్లి బాధితురాలి కుటుంబాన్ని బెదిరించ సాగాడు. ఈ క్రమంలో ఇరు కుంటుంబాల మధ్య వార్ కొనసాగుతూ వచ్చింది.
అయితే సోమవారం నాడు.. గౌరవ్శర్మ భార్య,అత్త స్థానికంగా ఓ గుడికి వెళ్లారు. అదే టైంలో గౌరవ్ శర్మ వేధింపులు చేసిన బాధితురాలు, ఆమె సోదరి కూడా అదే ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలో మరోసారి ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని గౌరవ్ శర్మకు ఆమె భార్య ఫోన్ చేసి చెప్పింది. దీంతో వెంటనే గౌరవ్ శర్మ ఆలయానికి చేరుకుని అందర్నీ పిలిచి గొడవను మరింత పెద్దగా చేశాడు. అటు బాధితురాలి తండ్రి కూడా విషయం తెలుసుకుని ఆలయానికి చేరుకున్నారు. ఇంతలో గౌరవ్ శర్మ బాధితురాలి తండ్రి రాకు చూసి రెచ్చిపోయాడు. అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కాగా నిందితుడు గౌరవ్ శర్మ పక్కా స్కెచ్ వేసి తన తండ్రిని హతమార్చాడని లైంగిక వేధింపుల బాధితురాలు ఆరోపించింది. అతడిని జైలుకు పంపించాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని తమపై గొడవకు దిగాడని విలపించింది. తమకు న్యాయం చేయాలని, తన తండ్రిని పొట్టన బెట్టుకున్న నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది.
మరోవైపు హత్రస్లో జరిగిన ఈ సంఘటనపై రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యానాథ్ సీరియస్ అయ్యారు. ఘటనకు పాల్పడ్డ వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని.. అవసరమైతే ఈ ఘటనకు పాల్పడ్డ వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ చేసిన పోలీసులు నలుగురు పేర్లను చేర్చారు. వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.