ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పీఎం శ్రీ యోజన అనే కొత్త పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ స్కీమ్ కింద లక్షలాది మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరనుంది.న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లక్ష్యాలను సాధించే దిశగా మరో కీలక అడుగుపడింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పీఎం శ్రీయోజన పేరుతో కొత్త పథకాన్ని మోదీ ప్రారంభించారు. స్కీమ్ కింద 14 వేల పాఠశాలలను పీఎం శ్రీ స్కూల్స్ గా అప్ గ్రేడ్ చేయనున్నారు.
ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా- పీఎం శ్రీ యోజన కింద.. దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేసి, అప్గ్రేడ్ చేస్తామని, ల్యాబ్లు, స్మార్ట్ క్లాస్రూమ్లు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలు సహా ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు. తాజా స్కీమ్తో పాఠశాలలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విధానం స్ఫూర్తితో మోడల్ పాఠశాలలుగా మారుతాయని మోదీ ట్విట్టర్ వేదిగ్గా తెలిపారు.
పీఎం శ్రీ పాఠశాలలు విద్యను అందించడానికి ఆధునిక, పరివర్తన, సంపూర్ణ విధానాన్ని కలిగి ఉంటాయని…. డిస్కవరీ- ఓరియంటెడ్, లెర్నింగ్-సెంట్రిక్ బోధనా విధానంపై దృష్టి పెడతాయనీ మోదీ అన్నారు. అత్యాధునిక సాంకేతికత, స్మార్ట్ క్లాసులు, క్రీడలకు అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
NEP విద్యారంగంలో మార్పులు తెస్తోందన్న మోదీ… ఈపాలసీ ద్వారా…పీఎం శ్రీ పాఠశాలలు భారత్ లోని లక్షలాదిమంది విద్యార్థులకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ప్రధాన మంత్రి కార్యాలయం సైతం ప్రకటన విడుదల చేస్తూ… ‘ఈ పాఠశాలల లక్ష్యం మెరుగైన బోధన, అభ్యాసం, అన్ని విధాల అభివృద్ధి మాత్రమే కాకుండా, 21వ శతాబ్దపు కీలక నైపుణ్యాలతో కూడిన సంపూర్ణ, సుసంపన్నమైన వ్యక్తులను సృష్టించడం.’ అని తెలిపింది. ఈ పాఠశాలల్లో ల్యాబ్లు, స్మార్ట్ క్లాస్రూమ్లు, లైబ్రరీలు, స్పోర్ట్స్ పరికరాలు, ఆర్ట్ రూమ్ మొదలైన ఆధునిక మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ పాఠశాలలు నీటి సంరక్షణ, వ్యర్థాల రీసైక్లింగ్, ఇంధన-సమర్థవంతమైన హరిత పాఠశాలలుగా కూడా అభివృద్ధి చెందుతాయని పీఎంవో తెలిపింది.
The PM-SHRI schools will have a modern, transformational and holistic method of imparting education. Emphasis will be on a discovery oriented, learning centric way of teaching. Focus will also be on modern infra including latest technology, smart classrooms, sports and more.
— Narendra Modi (@narendramodi) September 5, 2022