బిహార్ సీఎం నితీష్ కుమార్ కు మరో షాక్ ఇచ్చింది బీజేపీ. నితీష్ తో తెగతెంపులు చేసుకున్న తరువాత ప్రత్యర్థులుగా మారిన ఇద్దరూ వార్ మొదలుపెట్టేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఎమ్మెల్యేలను లాగేసుకున్న ఆ పార్టీ ఇప్పుడు డయ్యూడామన్ లోని జేడీయూకి చెందిన 17మంది పంచాయతీ సభ్యులను తీసేసుకుంది. తాజాగా వారంతా కాషాయకండువా కప్పుకున్నారు. అంతేకాదు కేంద్రపాలిత ప్రాంతంలోని మరికొందరు నేతలూ బీజేపీలో చేరిపోయారు. బీజేపీతో బంధం తెంచుకున్న నితీష్ నిర్ణయం తమకు నచ్చలేదనిఅందుకే బీజేపీలో చేరుతున్నట్టు వారు తెలిపారు.
ఇంతకుముందు కూడా అరుణాచల్ ఎమ్మెల్యేలను పార్టీ కలిపేసుకుంది.2019 అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేలు విజయం సాధించగా వారందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయకండువాలు కప్పుకున్నారు. ఇక మణిపూర్ లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలుండగా వారిలో ఐదుగురు కూడా బీజేపీలో చేరిపోయారు. వారు బీజేపీలో విలీనం అయినట్టు మణిపూర్ స్పీకర్ ప్రకటించారు.