ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కు గట్టిషాక్ తగిలింది. ఆయనపై ఉన్న అవినీతి కేసుల్లో సీబీఐ దర్యాప్తు తిరిగి ప్రారంభించింది. యూపీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ…పలు ప్రాజెక్టుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలువచ్చాయి. 2018లో దానిపై విచారణ చేపట్టిన సీబీఐ 2021లో ముగించింది. కేసులో లాలూతో పాటు ఆయన కుమారుడు తేజస్వియాదవ్, కుమార్తెలు చందాయాదవ్, రాగిణి యాదవ్ ల పేర్లను నిందితులుగా పేర్కొంది. ఇప్పటికే దాణా కుంభకణంలో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం బయటే ఉన్నారు. ఇటీవలే ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. లాలూ కుమార్తె కిడ్నీ దానం చేశారు.