రష్యాకు చెందిన మరో వ్యక్తి ఒడిషాలో మృతిచెందాడు. జగత్సింగ్ పూర్ జిల్లా పారాదీప్ పోర్టులోని ఓనౌకలో ఆ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అతన్ని మిల్యాకోవ్ సెర్గీగా గుర్తించారు.బంగ్లాదేశ్ చిట్టగాంగ్ నుంచి పారాదీప్ మీదుగా ముంబై వెళ్లే నౌకలో అతను చీఫ్ ఇంజినీర్ గా విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలిసింది.ఉదయం నాలుగున్నరకు అతని మృతదేహాన్ని గుర్తించారు. రెండు వారాల వ్యవధిలో రాష్ట్రంలో ముగ్గురు రష్యన్లు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.