మరో కశ్మీర్ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. బుద్గాంలో రాహుల్ భట్ అనే పండిట్ ను లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పు లు జరిపారు. శ్రీనగర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాహుల్ భట్ చనిపోయాడు. చడూరలోని తహశీల్దార్ కార్యాలయం దగ్గర రాహుల్ ను చుట్టుముట్టి ఉగ్రవాదులు దాడిచేశారు.
రాహుల్ భట్ హత్యను కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. స్థానికులపై ఏడాదిగా దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో
వలస కార్మికులు, పండిట్లే లక్ష్యంగా వరుస దాడులు పెరిగాయి. గతేడాది అక్టోబర్లో 5 రోజుల వ్యవధిలో ఏడుగురు పౌరులు చనిపోగా అందులో కాశ్మీరీ పండిట్లే నలుగురున్నారు.