దేశంలో లవ్ జిహాద్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా డిల్లీలో మరో కేసు వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ యువతిపై దాడిచేశాడు సైఫ్ అన్సారీ అనే యువకుడు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చే ప్రయత్నం చేశాడు. ఒప్పుకోలేదని చిత్రహింసలు పెట్టాడు. ఆ యువతిని ఢిల్లీలోని పహర్గంజ్, గురుగ్రామ్, రోహితాస్ సహా బీహార్ ప్రాంతంలో 8 నెలలకు పైగా బంధించినట్టు తెలిసింది. అతని తండ్రి సహా కుటుంబంలోని పలువురు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన ప్రతిసారీ నిందితుడు వీడియో రికార్డ్ చేసి, ఇస్లాం మతంలోకి మారాలని బ్లాక్ మెయిల్ చేయసాగాడు.
https://twitter.com/BefittingFacts/status/1530040372801380352?s=20&t=a3jYp75cm8LDWec4JEoHSg
ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న హిందూ మహిళ ఉద్యోగం కోసం రోజూ ఢిల్లీ నుంచి గురుగ్రామ్కు కొంతకాలం కిందట వెళ్లింది. ఆ సమయంలో అన్సారీ సమీపంలోని బస్ స్టేషన్లోని టైమింగ్ కౌంటర్లో పనిచేసేవాడు. అతను ప్రతిరోజూ ఆమెను గమనిస్తూ ఉండేవాడు. కోవిడ్ సమయంలో ఓ స్నేహితుడికి ఉద్యోగం ఇప్పించాలని కోరారు. తన ఆఫీసులో ఏదైనా అవకాశం ఉంటే చూడాలని వేడుకున్నాడు. ఆ టైంలో ఇద్దరూ ఒకరి నెంబర్లు మరొకరు తీసుకున్నారు. ఆతరువాత ఆమెతో చాటింగ్ మొదలుపెట్టారు. ఆ తరువాత పెళ్లికి ప్రపోజ్ చేశాడు. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు. అప్పటినుంచి దూరంగా ఉంటోంది. అయినా ఆమెను వెంబడించసాగాడు అన్సారీ. ఆమెపై నిఘా పెట్టాడు. 2021 సెప్టెంబరు 6న మరోసారి ఆమెకు ఎదురుపడి మారినట్టు నటించాడు. తాను బీహార్లోని తన స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నానని, ఆమెను చివరిసారి చూడాలని ఉందనిచెప్పి లంచ్ కి ఆహ్వానించాడు.ఢిల్లీలోని పహార్ గంజ్ ప్రాంతంలోని ఓ హోటల్ కు తీసుకెళ్లి బిర్యానీలో మత్తుమందు తినిపించి అత్యాచారం చేశాడు. దాన్ని వీడియో తీసి ఇస్లాంలోకి మారి పెళ్లిచేసుకోమని బ్లాక్ మెయిల్ చేయసాగాడు. అచేతన స్థితిలో ఉన్న ఆమెను బిహార్ తీసుకెళ్లి అక్కడ ఆమె తండ్రి షాహిద్ సహా ఇతరులతో అత్యాచారం చేయించాడు.
ఆ తరువాత వారం రోజులకు ఆమెను తిరిగి గురుగ్రామ్ తీసుకెళ్లి తండ్రి తరపు బంధువులింట్లో బంధించాడు. అక్కడా ఆ బంధువులు అత్యాచారం చేశారు. వాళ్లు కూడా ఇస్లాంలోకి మారాలని బలవంతం చేశారు. బలవంతంగా గొడ్డుమాంసం తినిపించారు.
బాధితురాలు మే 13న అక్కడి నుంచి తప్పించుకొని గురుగ్రామ్ పోలీసులను సంప్రదించింది. ఆమె మొత్తం భయానక సంఘటనను పోలీసులకు వివరించింది, వారు నిందితుడు, అతని బంధువులపై కేసునమోదు చేశారు. దీని ప్రకారం నిందితుడు సైఫ్ అన్సారీ, అతని తండ్రి షాహిద్ అన్సారీ, అత్త, మామ సహా బాధితురాలిని వేధించిన ఇతర బంధువులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం, సైఫ్ అన్సారీ ఇప్పటికే వివాహం అయింది. ఇంతకుముందు కూడా పలువురు బాలికల్ని మోసం చేశాడని తెలిసింది. వారిలో హిందూ యువతులున్నారు. ఏడాదిన్నరగా ఢిల్లీలో ఉంటూ అదే పనిచేస్తున్నాడు.