ముంబై లో సోనమ్ శుక్లా అనే 18 సం. ల ప్లస్ టూ చదివిన అమ్మాయి మెడిసిన్ చదవాలనే ఉద్దేశ్యంతో నీట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది.
రోజూ లాగే ఏప్రిల్ 25 సాయంత్రం 4 గం. లకు ట్యూషన్ కి వెళ్లిన అమ్మాయి రాత్రి 9.30 అయినా ఇంటికి చేరకపోవడంతో గాభరా పడ్డ తండ్రి ఫోన్ చేస్తే ఫ్రెండ్ ఇంట్లో వున్నాను, వచ్చేస్తాను అని చెప్పిందట. రాత్రి 11.30 అయినా ఇంకా ఇంటికి రాకపోవడంతో మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందట.
పోలీసులు ప్రకారం ఈ అమ్మాయి ట్యూషన్ కి వెళ్లకుండా స్నేహితురాలు ఇంటికి వెళ్ళిందట. రాత్రి 9 తరువాత అక్కడ నుండి తన స్నేహితుడు 23 సం. ల బేకరీ యజమాని అయిన మహమ్మద్ అన్సారీ ఇంటికి వెళ్లిందట. ముందే అన్సారీతో ఈ అమ్మాయికి పరిచయం ఉందట. ఆ రోజు అన్సారీ ఇంట్లో అతని తల్లి తండ్రులు లేరట. ఇద్దరి మధ్యా ఎదో గొడవ జరిగింది. కోపంతో అన్సారీ ఆ అమ్మాయి చనిపోయే వరకు వైర్ తో ఆమె గొంతు బిగించేశాడట. చనిపోయింది అని నిర్ధారించుకున్న తరువాత ఆ అమ్మాయి చేతులు కాళ్ళు కట్టేసి ఆమె బాడీ ఒక గొనె సంచిలో కుక్కేసి శవాన్ని చేపలు తినేస్తాయి అని భావించి పశ్చిమ మలాద్ ప్రాంతంలో గల సముద్రంలో విసిరేశాడట.
అయితే ఏప్రిల్ 25 రాత్రి బిడ్డ కనిపించడం లేదు అని సోనమ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 28 వ తేదీ వేరిసోవా వరిష్ఠ లేన్ తీరం వద్ద కుళ్లిపోయిన అమ్మాయి శవం దొరకడంతో పోలీసులు ఫోటో తీసి వారి వాట్స్ అప్ గ్రూప్స్ లో షేర్ చేయడంతో, గోరేగాన్ వెస్ట్ పోలీసులు సోనమ్ తండ్రిని సంప్రదించడం అతను కూపర్ హాస్పిటల్ లో పడివున్న తన కూతురు దేహాన్ని చూసి నిర్ధారించడం జరిగింది.
పోలీసుల విచారణలో ఈ అన్సారీ పేరు బయటకు వస్తే తమదైన రీతిలో విచారిస్తే నిజం ఒప్పుకుని భోరుమన్నాడట. తన బేకరీకి తరుచుగా వచ్చే సోనమ్ తో కావాలని పరిచయం పెంచుకున్నాను, శవాన్ని చేపలు తినేస్తాయి అని అనుకున్నాను అని చెప్పాడట. సంవత్సరం నుండి తిరుగుతున్నాం అని చెప్పాడట.
“నా కూతురు డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఉండేది. నా బిడ్డ ఉజ్వల భవిష్యత్తు చిన్నాభిన్నమైంది. మేము ఫిబ్రవరిలో ఆమె 18వ పుట్టినరోజును జరుపుకున్నాం. ఆమె రెండు నెలల్లో నీట్కు హాజరు కావాల్సి ఉంది. ఆమె రోజూ కనీసం 7 నుండి 8 గంటలపాటు ప్రవేశ పరీక్ష కు సిద్ధమయ్యేది, ”అని ఆమె తండ్రి చెప్పాడు.
తల్లి తండ్రులూ! పిల్లలకు సమాజంలో జరుగుతున్నవి చెప్పి జాగ్రత్త పడమని చెప్పవలసిన బాధ్యత మనదే. మన పిల్లలు మంచి వారు, అటువంటి ట్రాప్స్ లో పడరు అని అనుకోవడం మన మూర్ఖత్వం. పిల్లలతో తరుచుగా ఇటువంటి విషయాలు ఇళ్లల్లో డిస్కస్ చెయ్యండి.
జరిగిన తరువాత ఏడవడం వల్ల ఎవరినో తిట్టుకోవడం వల్ల తరువాత ఉపయోగం లేదు.
~ చాడా శాస్త్రి
