ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబ్ పేల్చాడు. మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ జైలు నుంచే మరో లేఖ విడుదల చేశాడు. లేఖతో పాటు కవితతో వాట్సప్ చాట్ బయటపెట్టడం సంచలనమైంది. ఇంకా తన దగ్గర 703 చాట్స్ ఉన్నాయని..అందులో ఇది రెండోది మాత్రమేననీ అన్నాడు. కవితక్క – టీఆర్ఎస్ అనే నంబర్తో తాను చాట్ చేసినట్లు సుఖేశ్ లేఖలో తెలిపాడు. AK, SJ, AP, సిస్టర్ పేర్లతో కోడ్ భాషలో చాటింగ్ చేసినట్లు సుఖేష్ తెలిపారు. 15 కేజీల నెయ్యి డెలివరీ చేశానని కోడ్ భాషలో సుఖేష్ చాట్లో తెలిపాడు. మొత్తం 6 పేజీల లేఖతో పాటు కవితతో చేసినట్లుగా చెప్పుకుంటున్న వాట్సప్ స్కీన్ షాట్స్ రిలీజ్ చేయటం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రశేఖర్ జైలు నుంచి మరో సంచలన లేఖ రిలీజ్ చేశారు. ఈ సారిలో లేఖతో పాటు తన వాట్సాప్ చాట్ను సుఖేష్ బయటపెట్టారు. కవితక్క – టీఆర్ఎస్ అనే నంబర్తో సుఖేష్ చాట్ చేయటం కలకలం రేపుతోంది.
గతంలో ఓసారీ సుఖేష్ తన లాయర్ ద్వారా లేఖలు విడుదల చేశాడు. అరవింద్ కేజ్రీవాల్తో తాను చేసిన మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లు చేశానని సుఖేష్ చంద్రశేఖర్ లేఖ ద్వారా వెల్లడించారు. అందులో కేజ్రీవాల్ చెప్పినట్లుగా తాను రూ. 75 కోట్లను.. హైదరాబాద్ బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద ఏకే అనే వ్యక్తికి ఇచ్చానన్నాడు. ఆయన ఆదేశాల మేరకే బీఆర్ఎస్ ఆఫీసు ప్రాంగణంలోనే రేంజ్ రోవర్లో ఉన్న ఏపీ అనే వ్యక్తికి ఆ డబ్బు ఇచ్చానన్నారు. ఆ రేంజ్ రోవర్ కారు నెంబర్ 6060 అని కూడా సుకేశ్ లేఖలో పేర్కొన్నాడు.
అయితే ఏపీ అంటే అరుణ్ రామచంద్ర పిళ్లైనా లేక మరో వ్యక్తా..అన్నది మాత్రం ఉత్కంఠంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు వరుసగా రిలీజ్ చేస్తానని ప్రకటించారు. కేజ్రీవాల్కు 2020కి సంబంధించిన చాట్ ట్రైలర్ను చూపించబోతున్నానని చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడిక కవితతో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లను లాయర్ బయపెట్టడం చర్చనీయాంశం అయింది.
https://twitter.com/Arvindharmapuri/status/1646092314060918784?s=20
https://twitter.com/Hema_Journo/status/1646095957938028545?s=20
జైలు నుంచి సుఖేష్ మరో లేఖ – లేఖతో పాటు కవితతో వాట్సప్ చాట్ బయటపెట్టిన సుఖేష్
గతంలో ఓసారీ సుఖేష్ తన లాయర్ ద్వారా లేఖలు విడుదల చేశాడు. అరవింద్ కేజ్రీవాల్తో తాను చేసిన మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లు చేశానని సుఖేష్ చంద్రశేఖర్ లేఖ ద్వారా వెల్లడించారు. అందులో కేజ్రీవాల్ చెప్పినట్లుగా తాను రూ. 75 కోట్లను.. హైదరాబాద్ బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద ఏకే అనే వ్యక్తికి ఇచ్చానన్నాడు. ఆయన ఆదేశాల మేరకే బీఆర్ఎస్ ఆఫీసు ప్రాంగణంలోనే రేంజ్ రోవర్లో ఉన్న ఏపీ అనే వ్యక్తికి ఆ డబ్బు ఇచ్చానన్నారు. ఆ రేంజ్ రోవర్ కారు నెంబర్ 6060 అని కూడా సుకేశ్ లేఖలో పేర్కొన్నాడు.
అయితే ఏపీ అంటే అరుణ్ రామచంద్ర పిళ్లైనా లేక మరో వ్యక్తా..అన్నది మాత్రం ఉత్కంఠంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు వరుసగా రిలీజ్ చేస్తానని ప్రకటించారు. కేజ్రీవాల్కు 2020కి సంబంధించిన చాట్ ట్రైలర్ను చూపించబోతున్నానని చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడిక కవితతో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లను లాయర్ బయపెట్టడం చర్చనీయాంశం అయింది.
https://twitter.com/Arvindharmapuri/status/1646092314060918784?s=20
https://twitter.com/Hema_Journo/status/1646095957938028545?s=20
Share: