డిల్లీ లిక్కర్ స్కాంలో మరో హైదరాబాదీ పేరు తెరమీదకు వచ్చింది. స్కాంలో నిధుల మళ్లింపుపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. దుబాయి కంపెనీతో పాటు ఫై అనే కంపెనీకి నిధులు మళ్లించినట్టు గుర్తించగా… ఆ కంపెనీ ఫౌండర్ ప్రవీణ్ గోరకవి. సైంటిస్ట్ అయిన ప్రవీణ్ పాత్రపైనా ఈడీ దర్యాప్తు చేస్తోంది. నిధుల్ని హవాలా రూపంలో ప్రవీణ్ కుమార్ కంపెనీకి మళ్లించినట్టు ఈడీ అభియోగం.ఆయనఇంటిపై గతంలో దాడులు నిర్వహించిన ఈడీ… 24 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది.