కశ్మీర్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను పొట్టనపెట్టుకుని రెండు రోజులు గడవకముందే ఓ వలస కార్మికుడిని హత్య చేశారు టెర్రరిస్టులు. బుద్గామ్ జిల్లా చదూరా ప్రాంతంలోని మాగ్రేపోరాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు ఇద్దరు స్థానికేతర కార్మికులపై కాల్పులు జరిపారు. వీరిలో ఒకరు తీవ్రగాయాలతో మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
https://twitter.com/AdityaRajKaul/status/1532396616417546240?s=20&t=HFLepeh-KjVCszRRkF7raA
కాల్పుల్లో మరణించిన కార్మికుడిని దిల్ఖుష్ కుమార్గా గుర్తించారు. బీహార్లోని వైశాలి జిల్లాలోని అర్నియా గ్రామ నివాసి. దిల్ఖుష్ను శ్రీనగర్లోని శ్రీ మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే చనిపోయాడు. గాయపడిన వ్యక్తి పంజాబ్ కు చెందిన రాజన్. వీరిద్దరూ బుద్గాం జిల్లాలో ఇటుక బట్టీలో కూలీలుగా పనిచేస్తున్నారు. రాజన్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బాధితులపై ఇస్లామిక్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా, క్రూరంగా కాల్పులు జరిపారని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు.
https://twitter.com/ANI/status/1532404236168105985?s=20&t=kQfp21ARnIk4P6-X9ZduIA
ఇండియన్ పీనల్ కోడ్ లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసారు, దర్యాప్తు కొనసాగుతోంది. సంఘటనా ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.
https://twitter.com/ANI/status/1532417122424725504?s=20&t=yOp07yGItJKzoir6rM_EmA
లోయలో వరుస హత్యాకాండ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ కొనసాగుతున్న పరిస్థితులపై చర్చించారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో రా చీఫ్ సామ్నాట్ గోయెల్ పాల్గొన్నారు. అమిత్ షా ఈరోజు ఢిల్లీలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, అలాగే అజిత్ దోవల్ హాజరుకానున్నారు.
ముఖ్యంగా లోయలో ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఉపాధి పొందుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతుండడంమై ఆందోళన వ్యక్తం అవుతోంది.
https://twitter.com/ARanganathan72/status/1532295810993426432?s=20&t=8ZBhO36B4ajerhbOlc45KA