మహారాష్ట్రలో మరో ఘోర ప్రమాదం జరిగింది. కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగి 14మంది సజీవ దహనం అయ్యారు. కొందరు ప్రాణాలతో బయటపడ్డారు.
ముంబైకు సమీపంలో ఉన్న విరార్లోని ఓ ఆసుపత్రిలో ఈ ప్రమాదం జరిగింది.పాల్ఘర్ జిల్లా విరార్లోని విజయ్ వల్లబ్ ఆసుపత్రిలో నిన్న తెల్లవారుజామున 3 గంటలకు రెండో అంతస్తులోని ఏసీలో షార్ట్ సర్క్యూట్తో పేలుడు సంభవించింది. క్రమంగా మంటలు వ్యాపించాయి. ఐసీయూలో చికిత్స పొందుతున్న 17 మందిలో 14 మంది సజీవ దహనం కాగా…ముగ్గురు తప్పించుకోగలిగారు. ప్రమాదం సమయానికి ఆస్పత్రిలో మొత్తం 90మంది రోగులున్నారు.