యూపీలో మరో ఎన్కౌంటర్.. ఈ సారి ఇద్దరు నేరగాళ్లు హతం..!
https://twitter.com/ANINewsUP/status/1367296058666061827
యూపీలో మరోసారి ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ను యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ ఎన్కౌంటర్లో హతమార్చింది. యూపీలో పేరుగాంచి గ్యాంగ్స్టర్లు మున్నా భజరంగీ,ముఖ్తార్ అన్సారీ ముఠాలకు చెందిన నేరగాళ్లు 2013లో డిప్యూటీ జైలర్ అనిల్ కుమార్ త్యాగీని హత్యచేశారు. అయితే త్యాగీని హత్యచేసిన ఇద్దరు క్రిమినల్స్ పరారీలో ఉన్నారు. అయితే వీరిలో మున్నా భజరంగీకి టీంకి చెందిన వకీల్ పాండే అలియాస్ రాజీవ్ పాండే, హెచ్ఎస్ అంజాద్ అలియాస్ పింటూలు ప్రయాగరజ్లో రాజకీయ నేతలను హతమార్చేందుకు ప్లాన్ వేశారు. అయితే విషయాన్ని తెలుసుకున్న యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్.. క్రిమినల్స్ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ప్రయాగరాజ్ సమీపంలోని అరైల్ వద్ద వకీల్ పాండే, పింటులను గుర్తించిన యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ టీం పట్టుకునేందుకు ప్రయత్నించింది. వీరిని గమనించిన క్రిమినల్స్ పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎదురుకాల్పులు చేపట్టారు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో వకీల్ పాండే, అంజాద్లు స్పాట్లోనే హతమయ్యారు. వీరి వద్ద నుంచి 9ఎంఎం పిస్టల్స్తో పాటు, బుల్లెట్లు, మోటర్ వెహికిల్ స్వాధీనం చేసుకున్నారు. మరణించిన క్రిమినల్స్ భదోహి జిల్లాకు చెందిన వారని.. వీరు డిప్యూటీ జైలర్ హత్యలో పాల్గొన్నారని ఎస్టీఎఫ్ అధికారి నవేందు సింగ్ తెలిపారు.