ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నిక రాబోతోంది. విశాఖపట్నం నుంచి శాసనమండలికి ఉపఎన్నిక జరగబోతోంది. ఈ నెల 30న జరిగే ఎన్నిక తెలుగుదేశం వైసీపీ మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది. వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కు టికెట్ ఖరారు చేశారు. తెలుగుదేశం నుంచి గండి బాబ్జీ పేరు ప్రధానంగా వినపడుతోంది.
స్థానిక సంస్థల కోటా నుంచి జరిగే ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎందుకంటే సుమారు 840 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 615 మంది వైసీపీ ప్రజాప్రతినిధులు కాగా, తెలుగుదేశం కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు 215 మంది మాత్రమే. మరి కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సీట్ ని గెలుచుకోవాలి అంటే,, వైసిపి నుంచి దాదాపు 200 మందిని ఇటువైపుకు లాక్కుని రావాలి. ఈ పది పదిహేను రోజుల్లోనూ ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడం కొంతవరకు కష్టమే. సూటిగా ఎన్నికల్లోకి వెళితే మాత్రం తెలుగుదేశానికి ఓటమి తప్పకపోవచ్చు. ఇటీవలి తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా జరిగింది. అధికారం కాంగ్రెస్ కాకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలుచుకుంది.
ఇప్పుడు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా నిలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం పొందిన వైసీపీకి ఈ సీటు గెలుపొందటం అంటే ఆ పార్టీ శ్రేణులలో నైతిక స్థైర్యం నింపినట్లే కాగలదు. అఖండ మెజార్టీ తరువాత జరిగే తొలి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ కూటమి ప్రయత్నిస్తుంది. అయితే ప్రతిపక్ష వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్న ఈ స్థానంలో కూటమికి గెలుపు పెద్ద సవాల్గా ఉంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలకే జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకం అయింది.
ఇప్పటికే వైసిపి చక చకా పావులు కదుపుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం వైసీపీ అభినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉనికిని సవాల్గా మారింది. కనుక ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు అధికార టీడీపీ కూటమికి, ప్రతిపక్ష వైసీపీకి సవాల్గా మారాయి. సంఖ్య బలం బట్టి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అత్యధికంగా వైసీపీకి ఉన్నారు. . అయితే వారంతా వైసీపీ అభ్యర్థికి ఓటేస్తారా? అనే మీమాంసం నెలకొంది.
అటు తెలుగుదేశం కూడా ఎత్తుగడలు మొదలుపెట్టింది.
తక్కువ మంది స్థానిక సంస్థల సభ్యులున్న అధికార టీడీపీ గెలవడానికి వైసీపీ సభ్యులను లాగాల్సి ఉంటుంది. టీడీపీ ఆ ప్రయత్నాలను మొదలు పెట్టింది. మరోవంక వైసీపీ నుంచి వలసలను నివారించడానికి ఆ పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలి జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలలో చేరారు. దీంతో జీవీఎంసీని సొంతం చేసుకోవాలని టీడీపీ కూటమి ప్రయత్నాలు చేస్తోంది.
2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ బహిష్కరించిడంతో వైసీపీకి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి, జనసేనలో చేరారు. జనసేన తరపున విశాఖ సౌత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆ స్థానం ఖాళీగా ఏర్పడింది. అందుకనే ఈ స్థానాన్ని కాపాడుకొనేందుకు వైసిపి, దీనిని గెల్చుకోవడం ద్వారా ఉత్తరాంధ్రలో వైసిపి రాజకీయ ఉనికిపై దెబ్బ తీసేందుకు టిడిపి ప్రయత్నాలు ప్రారంభించాయి.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ సీటు నెలకొనే ఉంది. దీని కింద ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అన్ని ప్రాంతాలు కు చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఓటర్లుగా నిలుస్తున్నారు. మరి ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి.