
ఐటీ రంగంలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు.ఎలక్ర్టానిక్స్, సెల్ఫోన్ తయారీ రంగంలో అతిపెద్ద సంస్థగా పేరొందిన తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ యూనిట్ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియా, మంత్రి సబితా రెడ్డి తో కలిసి ఆయన పాల్గొన్నారు. రూ.1,655 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ గ్రామంలో ఫాక్స్కాన్ సంస్థ ఏర్పాటు కానుంది. ఇందుకోసం కొంగరకలాన్లో జిల్లా కలక్టరేట్ సమీపంలో సర్వే నెంబర్ 300లో 196 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది ఫాక్స్కాన్ పరిశ్రమలో 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి లభించనుందన్న కేటీఆర్.. మరో 10 ఏళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఫాక్స్ కాన్ తో ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియా పాల్గొన్నారు.