లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియామీద మరో కేసు నమోదైంది. ఢిల్లీ ఫీడ్బ్యాక్ యూనిట్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ మరో కేసు పెట్టింది. చట్ట వ్యతిరేకంగా ఫీడ్బ్యాక్ యూనిట్ను రూపొందించి అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు లక్షల్లో నష్టం వాటిల్లిందని అభియోగాలు మోపిన సీబీఐ… ఆయనతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసింది.
సిసోడియా సీబీఐ కస్టడీ సోమవారంనాడు ముగుస్తుండటంతో ఆయనను రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు మధ్యాహ్నం హాజరుపరిచారు. ఆయన కస్టడీ పొడిగింపును సీబీఐ కోరకపోవడంతో ఈనెల 20వ తేదీ వరకూ ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్పాల్ ఆదేశాలిచ్చారు. తనను మెడిటేషన్ సెల్లో ఉంచాలంటూ సిసోడియా చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
CBI registers fresh corruption case against former Delhi Deputy Chief Minister Manish Sisodia and others over alleged irregularities in Delhi government's 'Feedback Unit' pic.twitter.com/tew89t7sei
— ANI (@ANI) March 16, 2023