ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం అమర్నాథ్ యాత్రకు అడుగడుగునా ఆటంకం అవుతోంది. మూడు రోజుల విరామంతో మొదలైన యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. పహెల్గాం,బల్తాల్ మార్గాల్లో వెళ్లేందుకు అక్కడి సిబ్బంది భక్తులకు అనుమతించడం లేదు.వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాతనే అనుమతిస్తామని చెబుతున్నారు. యాత్ర ప్రారంభమైన నాటినుంచి యాత్రకు బ్రేక్ పడడం ఇది రెండోసారి. జమ్మునుంచి మొన్న బయల్దేరిన 4వేలమంది భక్తులు మంచులింగాన్ని దర్శనం చేసుకుని క్షేమంగా వెనక్కి చేరుకున్నారు.