డిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ వేగవంతం చేసింది సీబీఐ. కొంతగాలంగా పలువురిని విచారించిన అధికారులు మరొకరిని అరెస్టే చేశారు. స్కాంలో కీలక నిందితుడిగా భావిస్తున్న హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐఅరెస్ట్ చేసింది.హైదరాబాద్లో ఉన్న అతన్ని అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించింది. ఈకేసులో ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అభిషేక్ అరెస్ట్ కు ముందు విజన్ నాయర్ ను అదుపులోకి తీసుకు సీబీఐ.అభిషేక్ ను కోర్టులో హాజరుపరుస్తామని సీబీఐ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఇదే కేసులో విచారణ సాగిస్తున్న ఈడీ కూడా మరో వ్యక్తి సమీర్ మహేంద్రను అరెస్ట్ చేసింది.
Central Bureau of Investigation (CBI) has arrested one Abhishek Boinpally in an ongoing investigation of a case related to alleged irregularities in framing & implementation of the excise policy of GNCTD of Delhi. He will be produced before in court.
— ANI (@ANI) October 10, 2022
అభిషేక్ రావు రాబిన్ డిస్టిలరీస్లో డైరెక్టర్గా ఉన్నట్లు తెలుస్తోంది. అనూస్ బ్యూటీపార్లర్లోనే డిస్టిలరీస్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు నడిపిస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. హైదరాబాద్కి చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైతో కలిసి ఆయన వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలింది.
9 కంపెనీల్లో అభిషేక్ రావు డైరెక్టర్గా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్లు జరిగే అవకాశముందనే చర్చ నడుస్తోంది.