కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో 500 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో వెయ్యికోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆయన పర్యటించారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో JNTU చేరుకున్న సీఎం అక్కడి నుండి రోడ్డు మార్గంలో కొండగట్టు వెళ్లారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి తరహాలోనే అంజన్న దేవాలయాన్ని తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అందుకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను సీఎంకు అధికారులు వివరించారు. 1998 తరువాత దాదాపు 25 ఏళ్లకు కొండగట్టు ఆలయాన్ని కేసీఆర్ దర్శించుకున్నారు.