ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈనెల 1 నాటికి 41,177 ఖాళీలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఒక్క ఎస్బీఐలోనే ఎక్కువగా 8,544 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. అలాగే పీఎన్బీలో 6,743, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6,295, ఇండియన్ ఓవర్సీస్ లో 5,112, బీవోఐలో 4,848 ఖాళీలున్నాయని వివరించారు. 12 PSBలలో 8,05,986 పోస్టులు మంజూరయ్యాయి. సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు ఆమె వివరాలతో రాతపూర్వక సమాధానమిచ్చారు.
ఈ 41,177 ఖాళీలు ఆఫీసర్, క్లర్క్ , సబ్-స్టాఫ్ మూడు విభాగాల్లో ఉన్నాయన్నారు. పీఎస్బీల్లో సిబ్బంది కొరత కారణంగా విధుల నిర్వహణ సరిగా లేదా అని సభ్యులు ప్రశ్నించగా… పీఎస్బీల్లో మంజూరైన సిబ్బంది సంఖ్యకు విరుద్ధంగా 95 శాతం మంది సిబ్బంది ఉన్నారని మంత్రి తెలిపారు.