ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ టెక్నాలజీ CIPET ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. రేపు జైపూర్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. అలాగే రాజస్థాన్లోని బన్స్వారా, సిరోహి, హనుమాన్గఢ్ మరియు దౌసా జిల్లాలలో నాలుగు కొత్త మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకం ఎస్టాబ్లిష్ మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ ఫర్ అటాచ్డ్ విత్ డిస్ట్రిక్ట్స్ బై రెఫరల్ హాస్పిటల్స్ కింద దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు.ముఖ్యంగా దేశంలోని వెనకబడిన జిల్లాలకు మూడు దశల కింద…మొత్తం 157 కాలేజీలను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం.