రాజకీయాలలో జాయిన్ అయి తొందరగా పైకి వచ్చి అధికారం డబ్బు సంపాదించాలి అనే కోరిక ఉన్న తెలివైన రాజకీయ నాయకుడు ఎవరూ అసలు తమిళనాడు లో ఉనికే లేని, గట్టి హిందూ, హిందీ, బిజెపి వ్యతిరేకత గల తమిళనాడులో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించరు.
అయితే, అందరిని ఆశ్చర్య పరుస్తూ తమిళనాడు కు చెందిన కర్ణాటక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కె. అన్నామలై బెంగుళూరు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఉద్యోగం నుండి రాజీనామా చేసి 2020 ఆగస్ట్ నెలలో బీజేపీలో జాయిన్ అయి తొందరలోనే పార్టీ అధ్యక్ష బాధ్యత స్వీకరించారు.
“నేను ఇది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని ఆయన చెప్పారు.”
ఈయన స్ట్రిక్ట్ ఆఫీసర్ గా కర్ణాటక లో పేరు తెచ్చుకోవడం తో ప్రజలు ఈయన్ను “సింగం అన్న” అని పిలుచుకుంటారు. “ఇంత తొందరగా రాజకీయాలలోకి వద్దామని అనుకో లేదు కానీ సామాజిక మార్పు సాధించాలి అంటే రాజకీయ మార్పు తప్పనిసరి అని గుర్తించాను” అని చెప్పారు. ప్రస్తుతం తమిళనాడులో స్వంత ఊరు కరూర్లో ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి సాంఘికసేవ కూడా చేస్తున్నారు
రెండు పెద్ద ద్రావిడ పార్టీలు ఉన్న తమిళనాడు లో అసలు ఉనికే లేని బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యారు అంటే… “బీజేపీని తమిళ ప్రజలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. అది మార్చడానికే బీజేపీలో జాయిన్ అయ్యాను” అని చెప్పారు.
“బీజేపీలో జాయిన్ అవ్వడానికి మోడీ నే స్ఫూర్తి. అతను చాలా క్రింద నుండి పైకి వచ్చిన వ్యక్తి, అతని కష్టపడేతత్వం, నిజాయితీ, పనితనం నాకు నచ్చాయి” అని చెప్పారు..
ఇతను ఇంజినీరింగ్ చదివి, IIM లక్నో నుండి ఎంబిఏ పూర్తి చేసి ఐపీఎస్ పాస్ అయ్యారు. ముస్లిం యువత తీవ్ర వాదం వైపు ఎందుకు వెళుతున్నారో తెలుసుకుందికి, ఇస్లాం గురించి తెలుసుకుందికి ఖురాన్, హాదిత్ లు ముస్లిం గురువుల దగ్గర నేర్చుకున్నారు.
ఈయన సినిమా పోలీస్ ఆఫీసర్ ల లాగా డ్రగ్ మాఫియా, గుట్కా మాఫీయా లపై పోరాటం చేశారు. కాలేజీల్లో కంప్లైంట్ బాక్స్ లు పెట్టి తమకు అనుమానం ఉన్న మత్తుమందు వాడుతున్న లేదా సేకరిస్తున్న వారి వివరాలు విద్యార్థుల ద్వారా వారి పేర్లు చెప్పనవసరం లేకుండా సంపాదించేవారు. సామాన్య ప్రజలను బాగా గౌరవిస్తారు. అందువల్లే నిజాయితీ గల ఆఫిసర్ గా ప్రజల మన్ననలు పొందాడు.
ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే, AIDMK కంటే కూడా ఎక్కువగా బీజేపీ నే విమర్శిస్తోంది. ఈ విమర్శలే తమిళనాడు లో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అద్ధం పడుతున్నాయి. ఇప్పుడు డీఎంకే అకస్మాత్తుగా హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టడానికి కూడా అదే కారణం.
ఈయన బిజెపి అధ్యక్ష పదవి చేపట్టి సుమారు 18 నెలలు అయింది. ఈ తక్కువ కాలంలోనే ఆయన డీఎంకే మరియు దాని చేతిలో మీడియాకు బీజేపీని విస్మరించడానికి లేదు అనే భయంలోకి నెట్టాడు.
ఈయన విజయాలు:
1. తమిళనాడు యూత్ ఐకాన్ అయిపోయాడు. ఎన్నికలు లేకపోయినా ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రజలు స్వచ్ఛందంగా వేలల్లో హాజరు అవుతూ రాజకీయపండితులను ఆశ్చర్య పరుస్తున్నాడు.
2. లోకల్ బాడీ ఎన్నికల్లో 30సం. లుగా బిజెపి ఓటు శాతం సుమారు 2%. ఈ సారి ఎన్నికల్లో 5.4% సాధించి కొన్ని ముఖ్యమైన సీట్లలో బిజెపి గెలిచింది.
3. దశాబ్దాల కుటుంబ, దోపిడీ పాలనతో విసిగిపోయిన తమిళ ప్రజలకు అన్నామలై ఒక విలక్షణ వ్యక్తిగా కనిపిస్తున్నాడు. సాధారణ బిజెపి కార్యకర్తలలో ఆత్మస్థైర్యం తీసుకువచ్చాడు.
4. తమిళ్ మీడియా మొత్తం డీఎంకే చేతిలో ఉంది. అది ప్రజల్లో డీఎంకే పై పాజిటివ్ అభిప్రాయం ఉంచడానికి 24 గం. లూ కృషి చేస్తుంది. అన్నా ఈ వ్యతిరేక మీడియాతో పోరాడవలసి వస్తోంది, ఇన్నాళ్ళూ డిఫెన్సె లో ఉన్న బీజేపీ అన్నా వచ్చాక అఫెన్స్ లోకి వెళ్లి తరుచూ ప్రెస్ కాన్ఫరెన్స్ లలో ఇబ్బందికర ప్రశ్నలు లెవనెత్తి డీఎంకే మీడియాను ఇరుకున పెడుతున్నాది.
5. తమిళ రాజకీయాలు ఇప్పటివరకు డబ్బు, వంశపారంపర్యం పై ఆధారపడ్డాయి. అలాగే పాపులర్ రాజకీయనాయకులు అందరూ 60 పై బడ్డ వారే. మొదటి సారిగా యువత 38 సం. ల అన్నామలై లో తమను చూసుకుంటున్నారు.
6. ఇన్నాళ్ళూ బిజెపి నడిపిన మెతక రాజకీయాలు తమిళ ప్రజలకు నచ్చలేదు. జయ డీఎంకే మీద వీరోచిత పోరాటం ద్వారానే గెలుపు సాధించింది. అందుకే అన్నా కూడా డీఎంకే మీద తీవ్ర పోరాటం చేసేవాడిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నాడు.
7. తమిళ్ ప్రజలు వ్యక్తి గత చరిష్మాకి ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు అన్నా తమిళ్ యువకుల యూత్ ఐకాన్ అయిపోయాడు.
8. డీఎంకే ధన, కండ బలానికి భయపడి ఇన్నాళ్ళూ స్తబ్దుగా ఉన్న చాలా డీఎంకే వ్యతిరేక కుల, సాంఘిక గ్రూపులు ఇప్పుడు అన్నా వెనుక చేరుతున్నారు.
9. ముఖ్యంగా హిందూ ధర్మం పై డీఎంకే దాడిని ప్రజలలోకి విజయవంతం గా తీసుకువెళ్లి దేవాలయ, హిందూ సాంస్కృతిక పరిరక్షణపై, మత మార్పిడి ముఠాలపై బహిరంగంగా మాట్లాడుతూ నిద్రపోతున్న హిందువులలో చైతన్యం రగులుస్తున్నాడు.
10. అన్నిటి కంటే కలిసొచ్చిన అంశం తమిళ నాట బాగా పాపులారిటీ ఉన్న పేరు
“అన్నా”
2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి 25 సీట్లు సాధిస్తాను అని చెపుతున్నాడు. అది అతిశయోక్తి అనిపించినా బిజెపి ఒంటిరిగా 5 సీట్లు సంపాదించినా తమిళ కుటుంబ రాజకీయాలలో పెను మార్పులు తధ్యం.
~చాడా శాస్త్రి