ప్రజలకు దగ్గర అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వము చక చక అడుగుల ముందుగా వేస్తోంది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్న క్యాంటీన్లో మరోసారి తెరిపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అంతట ఎంపిక చేసిన అన్న క్యాంటీన్లను ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు ఎంపీలు రేపు ప్రారంభోత్సవం చేస్తారు.
వాస్తవానికి 2014 19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అన్న క్యాంటీన్లు విరివిగా సేవలు అందించాయి. ఐదు రూపాయలకే మధ్యానం మరియు రాత్రి సమయాలలో భోజనాలు పెడుతూ ఉండేవారు. నిరుపేదలు రోజువారి కూలీలకు ఈ అన్నా క్యాంటీన్లు వరప్రసాదం అనే చెప్పుకోవాలి. చాలా చౌక ధరకే పరిశుభ్రమైన ఆహారం దొరుకుతూ ఉండటంతో పెద్ద సంఖ్యలో జనం వీటిని ఉపయోగించుకునేవారు.
కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడినాక ఈ అన్న క్యాంటీన్లను అర్ధాంతరంగా మూయించారు. ఈ క్యాంటీన్లో నిర్వహణతో తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది అన్న ఆలోచనతో క్యాంటీన్లకు మూత పెట్టారు కానీ రాష్ట్రవ్యాప్తంగా లక్షలమంది నిరుపేదలకు అన్నం దొరక్కుండా చేసేశారు దీనికి ప్రత్యామ్నాయం చూపిస్తాము అని వివరణ చెప్పారు తప్పితే ఎక్కడా కూడా అటువంటి ఏర్పాటు జరగలేదు. దీంతో నిరుపేదలు పెద్ద సంఖ్యలో వైసిపి ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ వచ్చారు. ఇది గమనించిన తెలుగుదేశం నాయకులు కొన్ని పట్టణాలలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లను నిర్వహించారు. టిడిపి పార్టీ నాయకులే చందాలు వేసుకుని ఆహార పదార్థాలు తీసుకొచ్చి మధ్యాహ్నం పూట భోజనం పెడుతూ వచ్చారు. చివరకు
మొన్నటి ఎన్నికలలో ఇది కూడా బలమైన కారణంగా నిలబడటంతో వైసిపి పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం జరిగింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం కూటమి అన్న క్యాంటీన్లను తెరిపిస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా విభిన్న నగరాలు , పట్టణాలలో అన్న క్యాంటీన్లను తెరిపించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈసారి అన్న క్యాంటీన్లలో మూడు పూటలా ఆహారం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ లేక ఉప్మా లేక పొంగల్ ఉండేటట్లుగా చర్యలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం మాత్రం చక్కటి అన్నంతో పాటు కూర, పప్పు, సాంబార్, పచ్చడి అందించాలని నిర్ణయించారు అదే మాదిరిగా రాత్రి కూడా పూర్తి స్థాయి భోజనం పెట్టేటట్లుగా నిర్ణయం తీసుకున్నారు.
అన్న క్యాంటీన్ లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు దగ్గర కావచ్చు అని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ క్యాంటీన్ నిర్వహణ కోసము పెద్ద ఎత్తున విరాళాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అన్నదానం చేయడంలో సహకరించాం అన్న సంతృప్తితో పాటుగా ప్రభుత్వ పెద్దలకు దగ్గర అవుతున్న భావన కూడా కనిపిస్తోంది.