మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఒక కూరగాయలమ్మే వ్యక్తి కుమార్తె సివిల్ జడ్జి అయ్యింది. 29ఏళ్ల అంకిత నగర్ బిహేవియరల్ జడ్జి (సివిల్ జడ్జి) క్లాస్-II గా నియమితులైంది. అంకిత తండ్రి అశోక్ నగర్ ఇండోర్లోని ముసాఖేడి ప్రాంతంలో కూరగాయలు అమ్ముతుంటాడు.
“రిక్రూట్మెంట్ పరీక్షలో మూడుసార్లు విఫలమైనప్పటికీ, నాలుగో ప్రయత్నంలో అనుకున్నది సాధించింది.
నా నాల్గవ ప్రయత్నంలో నేను సివిల్ జడ్జి క్లాస్-2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. ఇదంతా నా కుటుంబసభ్యుల ప్రోత్సాహమే. చాలా ఆనందంగా ఉందంటూ ఉద్వేగంతో మీడియాతో మాట్లాడింది.
“నేను డాక్టర్ కావాలనుకున్నా, కానీ అందుకు చాలా డబ్బు కావాలి. అందుకే సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధం అయ్యాను. ప్రభుత్వ స్కాలర్షిప్తో చదివాను” అని తెలిపింది.
తన కూతురు సాధించిన అద్భుత విజయంతో తండ్రి ఆనందం అంతాఇంతాకాదు. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ధైర్యం కోల్పోకుండా తన కుమార్తె అనుకున్నది సాధించిందని అన్నారు. ఎవరూ తమ కుమార్తెలను పెళ్లి చేసుకోమని బలవంతం చేయవద్దని… వారిని చదివించాలనీ కోరుతున్నారాయన.
అంకిత న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసిస్తున్నప్పుడు, ఆమె న్యాయమూర్తి కావాలని నిర్ణయించుకుంది.