తెలంగాణ ఇన్ చార్జి డీజీపీగా అంజనీ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంకా పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అంజనీకుమార్ ఏసిబి డీజీగా ఉన్నారు. హోమ్ సెక్రటరీగా ఉన్న రవి గుప్తాను ఏసీబీ డీజీగా, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ గా పనిచేస్తున్న జితేందర్ ను హోం సెక్రటరీగా, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ను సిఐడి అడిషనల్ డీజీగా, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ లో పనిచేస్తున్న దేవేంద్ర సింగ్ చౌహాన్ ను రాచకొండ సిపి గా, పి అండ్ ఎల్ అడిషనల్ డీజీగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ జైన్ ను లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.