మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. ఈ బిల్లుకు జీవం పోసేందుకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని లా డిపార్ట్మెంట్ తన అభిప్రాయాన్ని తెలిపినట్టు సమాచారం. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. సర్కారుపై విమర్శలు గుప్పించారు.