మరొక అరుదైన పురాతన విగ్రహం బయటపడింది. జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలోని కాకపోరా ప్రాంతంలో జీలం నది నుంచి అపురూపమైన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. కొందరు కూలీలు జీలం నదినుంచి ఇసుక తవ్వుతుండగా ఈ విగ్రహం బయటకు వచ్చింది. దీంతో సమాచారం అందుకున్న జిల్లా అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ అరుదైన విగ్రహం 9వశతాబ్దికి చెందినదని చెబుతున్నారు.