40 కోట్ల రూపాయల విలువైన పురాతన విగ్రహాలను తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహాబలిపురంలోని ఓ విగ్రహాల దుకాణంలో వీటిని గుర్తించారు. అరుదైన పార్వతీదేవి విగ్రహాన్ని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయానికి పెట్టారని సమాచారం అందడంతో పోలీసులు ఆ దుకాణంపై దాడిచేశారు. దుకాణం యజమాని జావేద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.