అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరో రెండురోజులుండగానే సందడి నెలకొంది. వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద మెడికల్ కాలేజీ విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. యోగావల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ… ఆయుర్వేద ఆస్పత్రి నుంచి పోచమ్మ మైదాన సర్కిల్ వరకు నడిచారు. కాలేజీ విద్యార్థులతో పాటు అద్యాపకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. యోగా డే సందర్భంగా…యోగా పట్ల అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలకు సిద్ధమవుతోంది ఏబీవీపీ జిజ్ఞాస.