హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలైన అయోధ్య, మధుర పరిసరాల్లో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది యోగీ సర్కారు. అయోధ్యలోని మద్యం దుకాణాల యజమానుల లైసెన్సులు రద్దు చేసింది. మధుర ఆలయ పరిసరాల్లో ఉన్న 37 బీరు, మద్యం, భంగ్ దుకాణాలు మూసివేశారు. అదే సమయంలో మథురలో పాల పరిశ్రమను పునరుద్ధరించాలని ప్రభుత్వం వ్యాపారులకు సూచించింది. వారణాసి, బృందావనం, అయోధ్య, చిత్రకూట్, దేవ్బంద్, దేవా షరీఫ్, మిస్రిఖ్-నైమిశారణ్య వంటి అన్ని ప్రార్థనా స్థలాల్లో మద్యం దుకాణాలు, మాంసాహార విక్రయాలను ఇప్పటికే నిషేధించింది ప్రభుత్వం.
https://twitter.com/Network10Update/status/1531914827240964097?s=20&t=nTC3PnyZp8NhEL32VT907Q